Vaccine certificate: వ్యాక్సిన్ సర్టిఫికెట్ గుర్తింపునకు 110 దేశాలు అంగీకారం!
మనదేశంలో ఇస్తోన్న వ్యాక్సిన్ సర్టిఫికేట్ను గుర్తించేందుకు ఇప్పటివరకు 110 దేశాలు భారత్తో పరస్పర అంగీకారం కుదుర్చుకున్నట్లు కేంద్రప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి
దిల్లీ: భారత్లో వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరి వివరాలను కొవిన్ పోర్టల్లో నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ పొందినట్లు కొవిన్ నుంచి ధ్రువపత్రం కూడా పొందవచ్చు. ఇలా మనదేశంలో ఇస్తోన్న వ్యాక్సిన్ సర్టిఫికెట్ను గుర్తించేందుకు ఇప్పటివరకు 110 దేశాలు భారత్తో పరస్పర అంగీకారం కుదుర్చుకున్నట్లు కేంద్రప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరిన్ని దేశాలు ఈ ధ్రువపత్రాన్ని గుర్తించేందుకు వాటితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపాయి. వీటివల్ల ఉన్నతవిద్య, వ్యాపారం, పర్యటన కోసం విదేశాలకు రాకపోకలను సాగించే భారతీయులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడ్డాయి.
దేశీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్లతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన వ్యాక్సిన్లను పొందిన వారికి ఇచ్చే వ్యాక్సిన్ ధ్రువపత్రాన్ని గుర్తించేందుకు ఇప్పటివరకు 110 దేశాలతో భారత్తో పరస్పర అంగీకరించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే, మరికొన్ని దేశాలు ఈ అంగీకారం చేసుకోనప్పటికీ భారత్లో గుర్తింపు పొందిన వ్యాక్సిన్లను తీసుకున్న వారిని తమ దేశంలోని అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. ఇక ఈ ఒప్పందం ఉన్న దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులకు కూడా క్వారంటైన్ నిబంధనలు అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. భారత్ నుంచి విదేశాలను ప్రయాణించే వారు మాత్రం కొవిన్ పోర్టల్ నుంచి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.
ఇదిలాఉంటే, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్కు భారత్తో పరస్పరం అంగీకారం తెలిపిన దేశాల్లో కెనడా, అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, బెల్జియం, ఐర్లాండ్, నెదర్లాండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్, స్వీడెన్, బ్రెజిల్, రష్యా, కువైట్, ఒమన్, యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్తోపాటు మొత్తం 110 దేశాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటికితోడు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పరస్పర గుర్తింపు కోసం మిగతా దేశాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం