Omicron: భారత్‌లో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ మన దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో.....

Published : 07 Dec 2021 02:06 IST

ముంబయి: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో మరో రెండు కొత్త కేసులు రావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో ఎనిమిది కేసులు వెలుగుచూడగా.. ముంబయి మహా నగరంలో తాజాగా నమోదైన ఈ రెండు కేసులతో ఆ సంఖ్య 10కి చేరింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తితో పాటు అమెరికా నుంచి ముంబయికి వచ్చిన మరో వ్యక్తి (36)లో ఒమిక్రాన్‌ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కొత్త వేరియంట్‌ కేసుల సంఖ్య 23కి పెరిగింది. 

మరోవైపు, ఆదివారం (నిన్న) ఒక్కరోజే దేశంలో 17 కేసులు (రాజస్థాన్‌లో తొమ్మిది, మహారాష్ట్రలో ఏడుగురు, దిల్లీలో ఒకరు) వెలుగుచూశాయి. వీరిలో దాదాపు అందరూ ఇటీవల ఆఫ్రికా దేశాలకు వెళ్లి వచ్చినవారు లేదా అలాంటివారికి సన్నిహితంగా మెలిగినవారే కావడం గమనార్హం. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 10 (కల్యాణ్‌ 1, పుణె 1, పింప్రీ-చించ్వాడ్‌లో 6, ముంబయి 2) కేసులు నమోదు కాగా.. రాజస్థాన్‌లో 9, కర్ణాటక 2, దిల్లీ 1, గుజరాత్‌లో 1 చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

Read latest National - International News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని