UP: భార్య హంతకుడి తలకు రైతు రివార్డు 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన ఓ రైతు.. తన భార్యను చంపిన వ్యక్తి తలపై రివార్డు ప్రకటించాడు.

Published : 18 Jul 2021 14:10 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన ఓ రైతు.. తన భార్యను చంపిన వ్యక్తి తలపై రివార్డు ప్రకటించాడు. జులై 8న షేర్‌పుర్‌లో పవిత్ర అనే మహిళను.. రోహిత్, అతని అనుచరుడు అభిషేక్‌ కాల్చి చంపారు. ప్రేమ పేరుతో వేధిస్తూ తన మరదలిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా పవిత్ర వారిని అడ్డుకుంది. దీంతో నిందితులు ఆమెపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసి రోజులు గడుస్తున్నా నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. విసుగెత్తిన ఆమె భర్త.. తానే నిందితులను పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన భార్యను చంపిన వారి ఆచూకీ చెబితే రూ.20వేల రివార్డు ఇస్తానని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని