Congress: పంజాబ్ పరిస్థితి మాకు రాదు.. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ సీఎంల ధీమా
పంజాబ్లో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు, నాయకత్వ మార్పు క్రమంలోనే... ఆ పార్టీ అధికారంలో
జైపుర్, రాయ్పుర్: పంజాబ్లో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు, నాయకత్వ మార్పు క్రమంలోనే... ఆ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. త్వరలోనే ఈ రెండు రాష్ట్రాల్లో నాయకత్వ మార్పు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం స్పందించారు. రాజస్థాన్లో తాము ఐదేళ్ల పాలన పూర్తిచేసుకుంటామని సీఎం అశోక్ గహ్లోత్ ధీమా వ్యక్తం చేశారు. పంజాబ్ పరిస్థితి తమకు రాదని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ పేర్కొన్నారు.
పంజాబ్లో పార్టీ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకోవడం, అమరీందర్సింగ్ సీఎం పదవికి, పార్టీకి రాజీనామా చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో గహ్లోత్ శనివారం తన నివాసం వద్ద మాట్లాడారు. ‘‘రాజస్థాన్లోని కాంగ్రెస్ సర్కారు ఐదేళ్ల పాలన పూర్తిచేసుకోవడమే కాదు... తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. నివేదికలు ఇదే చెబుతున్నాయి. మా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్లో గహ్లోత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ల మధ్య నాయకత్వ పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
దిల్లీలో బఘేల్ అనుచరులు!
ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ రెండున్నరేళ్లు సీఎం పదవిలో కొనసాగారు. ముందస్తు ఒప్పందం ప్రకారం, ఇప్పుడు ఆ పదవి తనకు ఇవ్వాలని ఆరోగ్యశాఖ మంత్రి టి.ఎస్.సింగ్దేవ్ పట్టుబడుతున్నారు. పంజాబ్ పరిణామాల నేపథ్యంలో బఘేల్ మాట్లాడుతూ... తమ రాష్ట్రం పంజాబ్ మాదిరి కాబోదని పేర్కొన్నారు. ‘‘ఛత్తీస్గఢ్ ఎప్పటికీ ఛత్తీస్గఢ్లానే ఉంటుంది తప్ప, పంజాబ్ మాత్రం కాబోదు. కాకపోతే, ఈ రెండు రాష్ట్రాల మధ్య ఓ పోలిక మాత్రం ఉంది. వాటి పేర్లలో అంకెలు ఉన్నాయి. పంజాబ్లో ఐదు నదులు ఉంటే, ఛత్తీస్గఢ్లో 36 కోటలున్నాయి’’ అని ఆయన అన్నారు. సీఎం పదవిలో పూర్తికాలం కొనసాగేందుకు బఘేల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు మద్దతు ఇస్తున్న పలువురు శాసనసభ్యులు మూడు రోజులుగా దిల్లీలో పర్యటిస్తున్నారు. అయితే- రాహుల్గాంధీ రాష్ట్ర పర్యటనకు రానున్న క్రమంలో, బఘేల్కు మద్దతుగా పార్టీ ఛత్తీస్గఢ్ వ్యవహారాల బాధ్యుడు పీఎల్ పూనియాను కలిసేందుకే తాము దిల్లీ వెళ్లినట్టు కొందరు శాసనసభ్యులు చెప్పారు. ఈ పరిణామంపై బఘేల్ స్పందిస్తూ-‘‘ఎమ్మెల్యేల దిల్లీ పర్యటనను రాజకీయ కోణంలో చూడొద్దు. ఎక్కడికీ వెళ్లకుండా వారిపై నిషేధమేమీ లేదు. వారు మళ్లీ తిరిగి వచ్చేస్తారు’’ అని పేర్కొన్నారు. సింగ్దేవ్ కూడా ఎమ్మెల్యేల పర్యటనపై తేలికచేసి మాట్లాడారు. దీనికి అంత ప్రాధాన్యం లేదని, రాష్ట్రంలో నాయకత్వ మార్పు అంశాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందన్నారు.
మోదీ పాలనలో మౌనం పనికిరాదు: కపిల్ సిబల్
అహ్మదాబాద్: మోదీ పాలనలో మౌనంగా ఉండకూడదని, అలా ఉంటే భాజపా దుర్మార్గాల్లో పాలుపంచుకున్నట్టేనని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు నేపథ్యంలో శనివారం ఆయన మాట్లాడారు. ‘‘జి-23 అసమ్మతి నేతల బృందం అంటూ కాంగ్రెస్లో ఏ వేదికా లేదు. ఉన్నదల్లా పార్టీలో సంస్కరణలు కోరుతున్నవారే. అందుకు పార్టీ సిద్ధమో, కాదో నాకు తెలియదు. కానీ, నా అభిప్రాయాలను మాత్రం నేను వ్యక్తం చేస్తున్నాను. రాజకీయ నిబంధనలను భాజపా మార్చేసింది. వ్యవస్థలను తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. మహాత్మాగాంధీని ప్రధాని మోదీ పొగుడుతున్నారు. కానీ, ఆయన చెప్పినదానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. గుజరాత్, కర్ణాటక, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులను భాజపా మార్చేసింది. ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్నూ ఇంటికి పంపాలని చూసింది. కానీ, కుదరలేదు. భాజపా వేధింపులపై రాహుల్గాంధీ తన స్వరమెత్తుతున్నారు. ఇది చాలా మంచి పని’’ అని సిబల్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?