Biden: ప్రాణనష్టం తప్పక పోవచ్చు.. కష్టమైనా కాబుల్ నుంచి ప్రజలను తరలిస్తాం: బైడెన్
కాబుల్ నుంచి వాయుమార్గంలో భారీగా ప్రజలను తరలించడం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ అని,
మా బలగాలను ప్రమాదంలోకి నెట్టి మరీ ఈ ప్రక్రియ చేపడుతున్నాం
చేపట్టిన పని పూర్తికాకుండా అఫ్గాన్ను విడిచేది లేదు
వాషింగ్టన్: కాబుల్ నుంచి వాయుమార్గంలో భారీగా ప్రజలను తరలించడం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ అని, ప్రాణనష్టం లేకుండా ఇది సాధ్యం కాకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అయినప్పటికీ, తాలిబన్ ఆక్రమిత అఫ్గాన్ నుంచి అమెరికన్లను, మిత్రదేశాల వారిని తరలిస్తామని అభయమిచ్చారు. అఫ్గానిస్థాన్ నుంచి ఈనెల 31లోగా తన బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్దేశించుకుంది. జులై నుంచి ఇప్పటివరకూ 18 వేల మందిని తరలించింది. తాలిబన్లు కాబుల్ను ఆక్రమించినా, అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రం ఇప్పటికీ అమెరికా బలగాల స్వాధీనంలోనే ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో, అమెరికా, మిత్రదేశాల వారూ... విదేశీ బలగాలతో కలిసి పనిచేసిన అఫ్గాన్లు భారీగా విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. అయితే, ధ్రువపత్రాల పరిశీలన జాప్యం కావడంతో తరలింపు ప్రక్రియ జాప్యమవుతోంది. ఈ విషయంలో అమెరికా తీరు పట్ల విమర్శలు రావడంతో బైడెన్ శనివారం శ్వేతసౌధం వద్ద మాట్లాడారు.
‘‘అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ కాబుల్ నుంచి భారీ సంఖ్యలో ప్రజలను తరలించే సామర్థ్యం ఈ ప్రపంచంలో ఒక్క అమెరికాకే ఉంది. మా పౌరులతోపాటు మిత్రదేశాలకు చెందిన సుమారు 65 వేల మందిని కూడా తరలిస్తాం. అయితే, ముందు అమెరికన్లకు ప్రాధాన్యమిస్తాం. చాలా సమస్యాత్మక పరిస్థితుల్లో, మా సాయుధ బలగాలను ప్రమాదంలోకి నెట్టి మరీ ఈ భారీ తరలింపు ప్రక్రియ చేపడుతున్నాం. ఇందుకు
సాధ్యమైనన్ని వనరులను రంగంలోకి దించుతాం. ఎక్కడా తప్పు జరగకుండా చూసుకోవాల్సి ఉంది. అయినా నష్టం తప్పకపోవచ్చు!
విదేశీ విమానాలకూ వెసులుబాటు...
కాబుల్ విమానాశ్రయంలో సుమారు 6 వేల మంది అమెరికన్ బలగాలు భద్రత కల్పిస్తున్నాయి. అక్కడి నుంచి కేవలం సైనిక విమానాలే కాకుండా, విదేశాలకు చెందిన పౌరరవాణా విమానాలు కూడా రాకపోకలు సాగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అఫ్గాన్ మహిళా నేతలు, పాత్రికేయులు సహా అమెరికా జర్నలిస్టులను సైనిక విమానాల్లో తరలించాం. మేం చేపట్టిన పని పూర్తికాకుండా అఫ్గాన్ను విడిచివెళ్లే ప్రసక్తే లేదు’’ అని బైడెన్ పేర్కొన్నారు.
ఓ వైపు ఆకలిదప్పులు.. మరోవైపు ఉత్కంఠ
బైడెన్ వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం కాబుల్ విమానాశ్రయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ‘ఎప్పుడెప్పుడు తమను తరలిస్తారా!’ అన్న ఆత్రుత, ఉత్కంఠ వేల మంది మోముల్లో కనిపించాయి. వీరందరికీ ఆకలిదప్పులు తప్పడంలేదు. విమానాశ్రయంలో తాగునీటికి కటకట నెలకొంది!
భారత్ ప్రభావం తగ్గించడానికే..
అఫ్గాన్లో పాక్ వ్యూహాలు అమెరికా నిఘా వర్గాల నివేదిక
అఫ్గానిస్థాన్పై భారత్ ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో పాకిస్థాన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు అమెరికా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ) ఇచ్చిన సమాచారాన్ని అమెరికా విదేశాంగశాఖ ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయం త్రైమాసిక నివేదికలో వెల్లడించింది. ‘‘అఫ్గాన్ అంతర్యుద్ధ ఫలితంగా పాకిస్థాన్ వ్యతిరేక తీవ్రవాదులు బలపడొచ్చని, శరణార్థులు పెద్ద సంఖ్యలో తమ భూభాగంలోకి ప్రవేశించవచ్చని, తద్వారా దేశంలో అస్థిరత ఏర్పడవచ్చని పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది. అఫ్గాన్పై భారత్ ప్రభావం తగ్గించే విధంగా తాలిబన్లతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే, శాంతి చర్చలకు మద్దతివ్వాలని భావిస్తోంది. మునుపటితో పోల్చితే, తాలిబన్లకు పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఆర్థిక సహకారం పెరిగింది. ఒకప్పుడు మసీదుల నుంచి వసూళ్లకు పాల్పడిన తాలిబన్లు... ఇప్పుడు సరిహద్దు నగరాలు, పట్టణాల్లో యథేఛ్ఛగా వసూలు చేస్తున్నారు. ఒక్కో దుకాణం నుంచి 50 డాలర్ల వరకూ అందుతున్నాయి.అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణను ఇరాన్ స్వాగతించినా, ఆ దేశంలో తాలిబన్ పాలనను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది’’ అని నిఘా వర్గాలు విశ్లేషించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
Fake Calls: టెలీకాం శాఖ పేరుతో మీకు కాల్స్ వస్తున్నాయా?ఫోన్ నంబరు డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. -
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!