TATA Sons-Air India: ఎయిరిండియా ప్రస్థానం.. టాటాల నుంచి టాటాల చేతుల్లోకి..!
ప్రభుత్వరంగ విమానయాన సంస్థగా ఉన్న ఎయిరిండియా ప్రస్థానం టాటాల గ్రూపునుంచే మొదలు కాగా.. 68ఏళ్ల తర్వాత చివరకు మాతృ సంస్థ టాటాల గూటికే చేరనుంది.
ఎయిరిండియా కొత్త యజమానిగా టాటా సన్స్
దిల్లీ: నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India)ను గట్టెక్కించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు చివరకు చేరుకున్నాయి. తాజాగా ఎయిరిండియాకు కొత్త యజమానిగా టాటా సన్స్ (TATA Sons) మారనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయంతో ఎయిరిండియా పూర్తిగా ప్రైవేటు చేతుల్లోకి వెళ్లనుంది. అయితే, ఇప్పటి వరకూ ప్రభుత్వరంగ విమానయాన సంస్థగా ఉన్న ఎయిరిండియా ప్రస్థానం టాటాల గ్రూపు నుంచే మొదలు కాగా.. 68ఏళ్ల తర్వాత చివరకు మాతృ సంస్థ టాటాల గూటికే చేరనుంది. ఈ ఆరున్నర దశాబ్దాల్లో ఎయిరిండియా ప్రయాణం ఇలా సాగింది.
* 1932 సంవత్సరంలో ఎయిర్లైన్స్ను స్థాపించిన జహంగీర్ రతన్జీ దాదాభోయ్ (JRD) టాటా తొలుత దానికి ‘టాటా ఎయిర్లైన్స్’గా నామకరణం చేశారు.
* 1946లో ఎయిరిండియాగా పేరు మార్చుకుంది. అనంతరం 1948లో అంతర్జాతీయ సేవలను ప్రారంభించిన ఎయిరిండియా.. యూరప్కు సర్వీసులు ప్రారంభించింది. తొలుత ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించగా.. అందులో ప్రభుత్వ వాటా 49శాతంగా ఉంది. మరో 25శాతం టాటాల, మిగతాది ఇతరుల వాటాగా ఉంది.
* 1953లో జాతీయీకరణతో ప్రభుత్వపరమైన ఎయిరిండియా.. అనంతరం నాలుగు దశాబ్దాల పాటు దేశీయ విమానయాన రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది.
* 1994-95లో ప్రైవేటుకు భాగస్వామ్యం కల్పించడంతో ఎయిరిండియా క్రమంగా మార్కెట్ షేర్ను కోల్పోవడం ప్రారంభించింది.
* 2000-01లో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం.. విమానయాన రంగంలో ప్రైవేటురంగానికి మరింత ప్రాధాన్యత కల్పించడంతో పాటు 40శాతం వాటాను విక్రయించే ప్రయత్నం చేసింది. అప్పట్లోనే వీటిని కొనేందుకు సింగపూర్ ఎయిర్లైన్స్, టాటా గ్రూప్స్ ఆసక్తి చూపించాయి. కానీ, ప్రైవేటీకరణపై వ్యతిరేకత రావడంతో ఆ ప్రయత్నం అంతటితో ఆగిపోయింది.
* 2004-2014 కాలంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం.. ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రయత్నాలకు దూరంగా ఉంది. అయితే, నష్టాలవైపు పరుగెడుతున్న ఎయిరిండియాను గట్టెక్కించేందుకు 2012లో (TAP, FRP) వంటి ప్రణాళికలకు యూపీఏ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయినప్పటికీ 2007-08లో ఇండియన్ ఎయిర్లైన్స్లో విలీనమైనప్పటి నుంచి ప్రతిఏటా నష్టాలను చవిచూస్తూనే ఉంది.
* 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఎయిరిండియా ప్రైవేటీకరణపై మళ్లీ దృష్టి పెట్టింది.
* 2017లో ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ సబ్కమిటీ (CCEA).. ఎయిరిండియాతోపాటు దాని ఐదు అనుబంధ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
* 2018 మార్చి: ఎయిరిండియాలో 76శాతం వాటాను విక్రయించేందుకు ఇన్వెస్టర్లను ఆహ్వానించింది. అయితే, 2018 వరకు ఎలాంటి బిడ్లు దాఖలు కాలేదు.
* 2019 మార్చి 31 నాటికి ఎయిరిండియా రుణ భారం రూ.60074 కోట్లకు చేరింది. ఇందులో రూ.23వేల కోట్లను కొనుగోలు దారులు భరించాల్సి వస్తుందని పేర్కొనడంతో బిడ్లు వేయడానికి ఇన్వెస్టర్లు ముందుకు రాలేదు.
* 2020 జనవరిలో ఎయిరిండియా నుంచి 100శాతం తప్పుకునేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం.. ఎయిరిండియా ఎక్స్ప్రెస్లోనూ 100శాతం వాటా కల్పిస్తామని ప్రకటించింది.
* 2020 అక్టోబరులో డీల్ను మళ్లీ సరళతరం చేసిన ప్రభుత్వం.. రుణభారం విషయంలో ఇన్వెస్టర్లకు ఊరట కలిగించే ప్రయత్నం చేసింది. దీంతో డిసెంబర్ 2020లో ఎయిరిండియాను సొంతం చేసుకునేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
* 2021 మార్చి నెలలో ఎయిరిండియా పరిస్థితిపై స్పందించిన పౌరవిమానయాన సంస్థ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ.. ఎయిరిండియాను పూర్తిగా ప్రైవేటుపరం చేయడమో లేదా పూర్తిగా మూసివేయడమో తప్పించి వేరే మార్గం లేదని అభిప్రాయపడ్డారు. నిత్యం రూ.20కోట్ల నష్టాలతో ఎయిరిండియాను నడపాల్సి వస్తోందని అన్నారు.
* 2021 ఏప్రిల్లో ప్రభుత్వం ఇందుకు బిడ్లను ఆహ్వానించగా టాటా గ్రూప్, స్పైస్జెట్లు ఫైనాన్షియల్ బిడ్లను దాఖలు చేశాయి.
* 2021 అక్టోబర్ చివరకు టాటా గ్రూప్ కోట్ చేసిన (రూ.18,000 కోట్లు) బిడ్తో పాటు సంస్థ పునరుద్ధరణపై టాటా గ్రూప్ సమర్పించిన ప్రణాళిక ఆకర్షణీయంగా ఉండడంతో ప్రభుత్వం వారిని విజయవంతమైన బిడ్డర్గా ఎంపిక చేసింది. దీంతో 68 ఏళ్ల తర్వాత మళ్లీ మాతృ సంస్థ చేతులోకే వెళ్లిపోయేందుకు ఎయిరిండియా సిద్ధమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు