Karnal: చర్చలు విఫలం.. సెక్రటేరియట్ ముందే రైతుల బైఠాయింపు!
అన్నదాతలపై పోలీసులు చేసిన లాఠీఛార్జిని నిరసిస్తూ హరియాణా రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది. రైతుల తలలు పగలగొట్టాలంటూ ఆదేశించిన ఐఏఎస్ అధికారి ఆయుష్ సిన్హాను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కర్నాల్లో మినీ సచివాలయం ముందు రైతులు చేస్తోన్న నిరసన రెండో రోజూ కొనసాగింది.
హరియాణా ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందన్న రైతు నేతలు
కర్నాల్: అన్నదాతలపై పోలీసులు చేసిన లాఠీఛార్జిని నిరసిస్తూ హరియాణా రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది. రైతుల తలలు పగలగొట్టాలంటూ ఆదేశించిన ఐఏఎస్ అధికారి ఆయుష్ సిన్హాను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కర్నాల్లో మినీ సచివాలయం ముందు రైతులు చేస్తోన్న నిరసన రెండో రోజూ కొనసాగింది. ఈ నేపథ్యంలో రైతులతో అధికారులు మరోసారి చర్చలు జరిపినప్పటికీ అవి సఫలీకృతం కాలేదు. దీంతో ప్రభుత్వం దిగొచ్చే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు.
ప్రభుత్వ మొండి వైఖరి వల్లే చర్చలు మరోసారి విఫలమయ్యాయని కిసాన్ సంయుక్త్ మోర్చా నేత యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. వీటిపై మూడు గంటలపాటు చర్చలు జరిగినప్పటికీ రైతుల డిమాండ్ల పట్ల హరియాణా ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని దుయ్యబట్టారు. కేవలం ఐఏఎస్ అధికారిపై కేసు నమోదు చేసిన ప్రభుత్వం.. ఆయనను సస్పెండ్ చేసేందుకు సిద్ధంగా లేదని విమర్శించారు. దీంతో ఇదే ప్రాంతంలో తమ దీక్షను కొనసాగించాలని నిర్ణయించినట్లు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయిత్ స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే, గత నెల 28న కర్నాల్లో రహదారిని దిగ్బంధం చేసిన రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడని, అందుకు బాధ్యుడైన ఆయుష్ సిన్హాను విధుల నుంచి తొలగించాలని కర్షక నేతలు డిమాండ్ చేశారు. ఇందుకు మద్దతుగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కర్నాల్లో జరిగిన కిసాన్ మహాపంచాయత్ కోసం తరలివచ్చిన వేల మంది రైతులు జిల్లా ప్రధాన కార్యాలయాలున్న మినీ సచివాలయానికి ర్యాలీగా వెళ్లి ముట్టడించారు. ఆ సమయంలోనూ వారిపై పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయమై బుధవారం కూడా జిల్లా అధికారులు మరోసారి చర్చలు జరిపినప్పటికీ రైతుల డిమాండ్లు నెరవేరకపోవడంతో కర్షక నేతలు నిరసన కొనసాగిస్తున్నారు. హరియాణా ప్రభుత్వం తమ డిమాండును నెరవేర్చేవరకూ అక్కడి నుంచి కదలబోమంటూ బైఠాయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.