Petrol Tax: ఆ ₹4 లక్షల కోట్లను రాష్ట్రాలకు పంచండి.. కేంద్రానికి మమతా బెనర్జీ డిమాండ్
ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సేకరించిన రూ.4లక్షల కోట్లను అన్ని రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేయాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కోల్కతా: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో ఇంధన ధరలు కాస్త తగ్గాయి. పలు రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించాయి. కానీ, ఎన్డీయేతర రాష్ట్రాలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నాయి. అంతేకాకుండా కేంద్రంపైనే పలు రాష్ట్రాలు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరికొత్త డిమాండ్తో ముందుకొచ్చారు. ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సేకరించిన రూ.4 లక్షల కోట్లను అన్ని రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేయాలన్నారు. కేవలం కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించారని దుయ్యబట్టారు.
రాష్ట్రాలకు డబ్బులు ఎక్కడ నుంచి..?
‘గతకొన్ని నెలలుగా వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచడంతో కేంద్ర ప్రభుత్వానికి రూ.4 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. ఇప్పుడు మాత్రం రాష్ట్రాలను వ్యాట్ తగ్గించాలని వారు (BJP) కోరుతున్నారు. అలాచేస్తే ఇక రాష్ట్రాలకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది..? అందుకే ఆ నాలుగు లక్షల కోట్ల రూపాయలను అన్ని రాష్ట్రాలకు సమానంగా పంచాలి’ అని బెంగాల్ అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలకు పలు సబ్సిడీలను అందిస్తున్నామని అన్నారు.
పలు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నందునే కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించే ప్రయత్నం చేస్తోందని మమత విమర్శించారు. ‘ఎప్పుడైతే ఎన్నికలు సమీపిస్తాయో.. వాళ్లు (కేంద్రం) ధరలను తగ్గిస్తారు. అవి ముగిసిన వెంటనే మళ్లీ పెంచుతూ పోతారు. ఇంధన ధరలపై మాకు పాఠాలు చెబుతున్న వారు.. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బు ఎక్కడ నుంచి వస్తుందో సమాధానం చెప్పాలి. ముందుగా రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి’ అని మమతా బెనర్జీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చమురుపై వ్యాట్ తగ్గించకుంటే ఉద్యమం చేపడతామని చెబుతున్న రాష్ట్ర భాజపా తీరుపై ఆమె విరుచుకుపడ్డారు. ఇక పశ్చిమ బెంగాల్కు వ్యాక్సిన్లను తక్కువగా అందజేయడంపైనా కేంద్రం తీరును ఎండగట్టారు. ఉత్తర్ప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే తమకు వ్యాక్సిన్లను తక్కువగా కేటాయిస్తున్నారని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం