China Celebrity Missings: ఆట లేదు.. మాట లేదు.. మమ్మల్ని ధిక్కరిస్తే మాయమే..!
చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా.. అక్కడి అధికారులపై ఆరోపణలు చేసినా.. చైనా అధినాయకుడి ఆగ్రహానికి గురి కావాల్సిందే.
చైనాలో పెరుగుతోన్న సెలబ్రిటీల మిస్టరీ మిస్సింగ్లు
బీజింగ్: చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా.. అక్కడి అధికారులపై ఆరోపణలు చేసినా.. చైనా అధినాయకుడి ఆగ్రహానికి గురి కావాల్సిందే. ఇలా అక్కడి ప్రభుత్వంపై వ్యతిరేక గళాన్ని వినిపించే వారిని చైనా అణచివేస్తోందనే వాదనలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా అసమ్మతిని అణగదొక్కడంలో భాగంగా అలాంటివారి ఆచూకీ లేకుండా చేస్తుందనే ఆరోపణలూ ఉన్నాయి. ఇలా గత కొంతకాలంలో చైనాలో ప్రముఖుల మిస్సింగ్లు మిస్టరీగా మారుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి ఆచూకీ కనిపించకుండా పోవడంపైన ఇలాంటి అనుమానాలే వ్యక్తమయ్యాయి. కేవలం పెంగ్ షువాయినే కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన జాక్ మా వంటి దిగ్గజ వ్యాపారవేత్తలు, అక్కడి కళాకారులు, సినీనటులు, ఉన్నతాధికారులు, మీడియా అధినేతలతోపాటు ఎంతో మంది ప్రముఖుల ఆచూకీ తెలియకుండా పోతున్నాయనే ప్రపంచ వ్యాప్తంగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వాటిలో కొన్ని మిస్టరీ కేసులపై ఓసారి గమనిస్తే..
అయ్ వీవీ: కళాకారుడు
కళాకారుడు, చిత్ర నిర్మాతైన అయ్ వీవీ చైనా ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేస్తూ ఓ అసమ్మతివాదిగా ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా అక్కడి ప్రజాస్వామ్యం, భావప్రకటనా స్వేచ్ఛ వంటి అంశాల్లో ఆయన బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తారు. దీంతో 2011లో ఆయనను అరెస్టు చేసిన ప్రభుత్వం.. దాదాపు 81రోజుల పాటు రహస్య ప్రదేశంలో నిర్బంధించింది. అంతేకాకుండా కొన్ని సంవత్సరాల పాటు ఆయన పాస్పోర్టును నిలిపివేసింది. చైనాలో ఆచూకీ లేకుండా చేయడం ఎలా ఉంటుందో అని ప్రపంచానికి చాటిచెప్పిన అతికొద్ది మంది సెలబ్రిటీల్లో వీవీ ఒకరనే చెప్పవచ్చు. 2015లో చైనా నుంచి బయటకు వచ్చిన వీవీ.. అక్కడి జైలు జీవితాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. ముఖ్యంగా తినడం నుంచి నిద్రపోయేవరకు, స్నానం నుంచి మలవిసర్జన వరకూ ప్రతి నిమిషాన్ని అక్కడి గార్డులు ఎలా పర్యవేక్షించేవారో చెప్పుకొచ్చారు.
ఝావో వీ: నటి
పాశ్చాత్య సంప్రదాయం వల్లే తమ యువత పెడదారి పడుతోందని భావిస్తోన్న చైనా ప్రభుత్వం.. అక్కడి సెలబ్రిటీలపైనా కన్నేసింది. ముఖ్యంగా పాప్ కల్చర్ కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల నుంచి అక్కడి యువతను దూరం చేస్తున్నట్లు ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఆగస్టు నెలలో అక్కడి ప్రముఖ పాప్ సింగర్ ఝావో కనిపించకుండా పోయారు. ఆమెకు చెందిన సమాచారం కూడా ఇంటర్నెట్ నుంచి అదృశ్యమయ్యింది. వీటికితోడు ఆమె సినిమాలు, టీవీ షోలు కూడా ఆన్లైన్ వేదికల నుంచి తొలగించబడ్డాయి. ఆ సమయంలో ఆమె కనిపించకుండా పోవడం మరోసారి చర్చనీయాంశమయ్యింది. కానీ, నెల రోజుల తర్వాత ఆమె స్వగ్రామంలో కనిపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆమె గృహ నిర్బంధంలో ఉన్నారా..? అనే విషయంపైనా స్పష్టత లేదు. తాజాగా ఓ ఆన్లైన్ షాపింగ్ కార్యక్రమంలో కనిపించినట్లు చైనాలోని ఓ ఇంటర్నెట్ పోర్టల్ వెల్లడించింది. కానీ, ఝావోపై అధికారిక సమాచారం మాత్రం ఇప్పటికీ తెలియదు.
మెంగ్ హాంగ్వే : ఇంటర్పోల్ చీఫ్
చైనాకు చెందిన మెంగ్ హాంగ్వే 2016లో ప్రపంచ వ్యాప్తంగా పోలీసులకు సహకారం అందించే ‘ఇంటర్పోల్’ విభాగానికి చీఫ్గా ఎన్నికయ్యారు. అంతకుముందు చైనాలో ప్రజాభద్రతా విభాగానికి ఇంఛార్జిగా ఉన్న మెంగ్ హాంగ్వే.. 2018లో అదృశ్యం కావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చైనాకు బయలుదేరినట్లు తన కుటుంబ సభ్యులకు చెప్పిన తర్వాత ఆయన ఆచూకీ లేకుండా పోయింది. దీనిపై ఆయన భార్య గ్రేస్ మెంగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫ్రాన్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలా మిస్టరీగా మారిన హాంగ్వేను ఓ కేసులో ప్రశ్నించడం కోసం చైనాకు తీసుకెళ్లినట్లుగా ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఓ కథనంలో పేర్కొంది. లంచాలు స్వీకరిస్తున్నారనే ఆరోపణలపై 2020లో మెంగ్ను అరెస్టు చేసినట్లు చైనా ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆ కేసులో ఆయనకు 13ఏళ్ల శిక్షపడినట్లు పేర్కొంది. దీంతో కిడ్నాపర్ల నుంచి ముప్పు పొంచివుందన్న ఆందోళన నేపథ్యంలో ఆయన భార్య గ్రేస్తో పాటు ఇద్దరు పిల్లలకు ఫ్రాన్స్ ఆశ్రయం కల్పించింది. ఈ మధ్యే తొలిసారి మీడియా ముందుకు వచ్చిన గ్రేస్ మెంగ్.. తన భర్త ఆచూకీ ఇప్పటికీ లభించలేదని వాపోయారు.
జాక్ మా : వ్యాపారవేత్త
చైనాలో శక్తివంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన అలీబాబా గ్రూప్ సంస్థ అధినేత జాక్మా పైనా చైనా ప్రభుత్వం కన్నేసింది. గతేడాది అక్టోబరులో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్ మా ప్రసంగిస్తూ.. చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎండగట్టారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని హితవు పలికారు. దీనిపై మండిపడ్డ చైనా ప్రభుత్వం.. ఆయనపై ప్రతీకార చర్యలకు ఉపక్రమించింది. ఆయనకు చెందిన యాంట్ ఫైనాన్షియల్ ఐపీఓను అడ్డుకోవడంతోపాటు గుత్తాధిపత్య పద్ధతులను అమలు చేస్తోందనే ఆరోపణలపై ఆ సంస్థపై విచారణకు ఆదేశించింది. దీంతో జాక్మా ఆస్తుల విలువ ఒక్కసారిగా పడిపోయాయి. అదే సమయంలో జాక్ మా దాదాపు మూడు నెలల పాటు బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పోయారు. దీంతో ఆయన ఎక్కడున్నారన్నది మిస్టరీగా మారింది. ఒకనొక సమయంలో జాక్ మా చైనాను విడిచి వెళ్లిపోయారనే ఊహాగానాలు వినిపించాయి. చివరకు ఆయన ఇంటినుంచి ఓ వీడియో కాల్లో ప్రత్యక్షమయ్యారు.
గువై మిన్హాయ్ : ప్రచురణకర్త
చైనా రాజకీయ నాయకులపై విమర్శలు చేస్తూ హాంకాంగ్ వేదికగా ప్రచురణలు చేసే గువై మిన్హాయ్.. 2015లో అదృశ్యమయ్యారు. కొన్ని నెలలపాటు ఆయన ఆచూకీ ఎవ్వరికీ తెలియలేదు. మరుసటి ఏడాది చైనా అధికారిక మీడియాలో ప్రత్యక్షమైన గువై.. మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో అరెస్టయినట్లు వెల్లడించారు. రెండేళ్ల తర్వాత కొన్ని ఆంక్షల నడుమ తాత్కాలికంగా విడుదల చేయడంతో పాటు వీడియో కాల్ చేసుకునేందుకు ఆయనకు చైనా అధికారులు అనుమతించారు. అదే సమయంలో ఓసారి మరో ఇద్దరు స్వీడన్ దౌత్యవేత్తలతో కలిసి ప్రయాణిస్తోన్న గువైని మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో చైనా తీరుపై స్వీడన్తో పాటు యూరప్ దేశాలు మండిపడ్డాయి. ఇలా గువైని నిర్బంధించడం యూరప్ - చైనా దౌత్య సంబంధాలపై కూడా తీవ్రంగా పడినట్లు తెలుస్తోంది.
పెంగ్ షువాయి : టెన్నిస్ క్రీడాకారిణి
చైనా ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి జాంగ్పై అక్కడి టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి లైంగిక ఆరోపణలు చేశారు. మరుసటి రోజు (నవంబర్ 2వ తేదీ) నుంచి పెంగ్ షువాయి కనిపించకుండా పోయారు. దీంతో ఆమె ఆచూకీపై ప్రపంచ వ్యాప్తంగా టెన్నిస్ క్రీడాకారుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సెరెనా విలియమ్స్, మహిళల టెన్సిస్ సంఘం (WTA) కూడా పెంగ్ అదృశ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం అంతర్జాతీయంగా తీవ్ర చర్చణీయాంశం కావడంతో చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ స్పందించింది. పెంగ్ షువాయి ప్రస్తుతం ఆమె నివాసంలోనే ఉన్నారని.. త్వరలోనే పౌర సమాజం ముందుకు వస్తారని పేర్కొంది. అయినప్పటికీ చైనా ప్రభుత్వ తీరుపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కేవలం వీరే కాకుండా గడిచిన దశాబ్ది కాలంలో ఎంతో మంది ప్రముఖులపై చైనా ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. కొవిడ్ విజృంభించిన సమయంలోనూ వుహాన్లో జర్నలిస్టు అదృశ్యమైన వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలు వ్యతిరేకించేవారి, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులతో పాటు ఇతర సినీ ప్రముఖుల జాడ లేకుండా చేస్తోందని విమర్శలు ఎక్కువయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!