China ZeroCovid: చైనాను వెంటాడుతోన్న ‘జీరో-కొవిడ్’ కష్టాలు..!
కరోనాకు పుట్టినిళ్లైన చైనా మాత్రం ‘కొవిడ్-జీరో (Zero Covid)’ వ్యూహంతోనే కరోనా కట్టడిలో ముందుకెళుతోంది.
కేసులను సున్నాకు తీసుకొచ్చే వ్యూహంతోనే కొవిడ్పై పోరు
బీజింగ్: యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కొవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు వివిధ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ వైరస్ రూపాంతరం చెందుతూ మళ్లీ విజృంభిస్తుండడంతో పలు దేశాలు కట్టడి వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ముఖ్యంగా వైరస్తో కలిసి జీవిస్తూనే మహమ్మారిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో కరోనాకు పుట్టినిల్లైన చైనా మాత్రం ‘కొవిడ్-జీరో (Zero Covid)’ వ్యూహంతోనే ముందుకెళుతోంది. ఇదే సమయంలో అక్కడ పలు నగరాల్లో వైరస్ ఉద్ధృతి పెరగడంతో నానా కష్టాలు పడుతోంది.
రోజురోజుకు రూపాంతరం చెందుతోన్న కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు.. వైరస్తో కలిసి జీవించే (Live with Covid) వ్యూహాన్ని ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి. ఓవైపు జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కృషి చేస్తున్నాయి. కానీ, చైనా మాత్రం కొవిడ్ కేసులను సున్నాకు తీసుకువచ్చే ‘జీరో-కొవిడ్’ కట్టడి వ్యూహాన్నే నమ్ముకుంది. దీంతో ఒక్క కేసు వెలుగు చూసినా.. లక్షల సంఖ్యలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్ చేపడుతోంది. ఇందుకోసం భారీ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటికితోడు వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా లాక్డౌన్ విధించడంతోపాటు విమాన ప్రయాణాలపైనా ఆంక్షలు కొనసాగిస్తోంది. గత కొంతకాలంగా పలు ప్రావిన్సుల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయలేక చైనా తీవ్రంగా శ్రమిస్తోంది.
సమర్థించుకుంటున్న డ్రాగన్..
అధిక జనాభా కలిగిన చైనాలో వైరస్ కట్టడికి అనుసరిస్తోన్న జీరో వ్యూహమే మేలని స్థానిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ వైరస్తో కలిసి జీవించాల్సి వస్తే ఎంతోమంది ఇన్ఫెక్షన్ బారినపడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చైనా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. అందుకే జీరో కట్టడి వ్యూహాన్ని అమలు చేస్తోందని అంటున్నారు. అయితే, ఈ వ్యూహం ఎంతకాలం విజయవంతం అవుతుందో చెప్పలేమని చైనా ఆరోగ్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఈ విధానంపై చైనా ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్లు పేర్కొంటున్నారు. అయితే, శీతాకాలంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నందున చైనా ప్రభుత్వం తన విధానంపై పునః పరిశీలన చేసుకోవచ్చని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన అంటువ్యాధుల నిపుణులు పీటర్ కల్లిగ్నాన్ పేర్కొన్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాలు కూడా చైనా వ్యూహాన్నే అమలు చేస్తున్నాయని గుర్తుచేశారు.
పలు రంగాలపై ప్రతికూల ప్రభావమే..
చైనా అనుసరిస్తోన్న జీరో కొవిడ్ వ్యూహం వల్ల పలు రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని మార్కెట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విదేశీ పర్యాటకులకు కేంద్రంగా ఉండే ఆతిథ్య రంగం కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని బీఎన్పీ పరిబాస్ అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థకు చెందిన నిపుణురాలు జెస్సికా టీ అంచనా వేశారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశం వరకూ కొవిడ్ కట్టడి వ్యూహంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని చైనాలోని స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్కి చెందిన చీఫ్ ఎకనమిస్ట్ షువాంగ్ డింగ్ పేర్కొన్నారు. అప్పటివరకు ఇతర దేశాల్లో వ్యాక్సినేషన్పై హెర్డ్ ఇమ్యూనిటీ ఫలితాలు, కొవిడ్ను స్థానిక వ్యాప్తిగా పరిగణించే ప్రకటనలను పరిశీలించిన తర్వాత చైనా తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
అప్పటివరకూ సరిహద్దుల మూతేనా..?
చైనాలో కొవిడ్ విజృంభణ కొనసాగుతున్న దృష్ట్యా దేశ సరిహద్దులను ఆ ప్రభుత్వం మూసివేసింది. ఆంక్షల నడుమ పరిమిత సంఖ్యలో మాత్రమే విదేశీయులను అనుమతి ఇస్తోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందికరంగా మారాయి. అంతేకాకుండా ఇతర దేశాల ఎగుమతి, దిగుమతులపైనా ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినా చైనాలో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ వరకూ అంతర్జాతీయ కొవిడ్ ఆంక్షలను చైనా ఎత్తివేయకపోవచ్చని అక్కడి పర్యాటకరంగ నిపుణులు గేరీ బొవెర్మ్యాన్ అంచనా వేశారు. మరో ఏడాది తర్వాతే సరిహద్దు ఆంక్షలను చైనా ఎత్తివేసే అవకాశం ఉందన్నారు. ఇలా వైరస్ కట్టడిని సమర్థంగా చేస్తున్నామని చెప్పుకుంటున్న చైనా.. జీరో కొవిడ్ వ్యూహంతో మాత్రం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈ మూడు విషయాలే ఆరోగ్యకర జీవన రహస్యం.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
ఆరోగ్యకరమైన జీవనానికి ఏం చేయాలో ఓ డాక్టర్ చెబుతున్న సీక్రెట్ ఫార్ములా వీడియోను హర్ష గోయెంకా ఎక్స్లో షేర్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
-
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
-
క్రికెట్ అభిమానులకు నో టికెట్.. సోషల్ మీడియాలో ‘బేరసారాలు’
-
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు