China Stock Exchange: చైనాలో కొత్తగా మరో స్టాక్ ఎక్ఛేంజీ!
చైనాలో కొత్తగా మరో స్టాక్ ఎక్ఛేంజీని ఏర్పాటు చేయబోతున్నట్లు అధ్యక్షుడు షీ జిన్పింగ్ వెల్లడించారు. దేశీయ సంస్థలు విదేశాలకు బదులుగా స్థానికంగానే నమోదు చేసుకునేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రకటన
బీజింగ్: చైనాలో కొత్తగా మరో స్టాక్ ఎక్ఛేంజీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్ వెల్లడించారు. దేశీయ సంస్థలు విదేశాలకు బదులుగా స్థానికంగానే నమోదు చేసుకునేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే అక్కడ రెండు స్టాక్ ఎక్ఛేంజీలు (షాంఘై, షెన్జెన్) ఉండగా.. కొత్తగా దీనిని బీజింగ్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
చిన్న, మధ్యతరహా కంపెనీలకు ఊతమివ్వడంలో భాగంగా ఈ నూతన స్టాక్ ఎక్ఛేంజీని ఏర్పాటు చేయబోతున్నట్లు బీజింగ్లో ఏర్పాటు చేసిన ఓ ట్రేడ్ ఫెయిర్లో అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రకటించారు. అయితే, వాటికి ఎలాంటి సహకారం ఉంటుందనే విషయాలు మాత్రం అధ్యక్షుడు వెల్లడించలేదు.
మరోవైపు గతకొన్ని రోజులుగా టెక్ కంపెనీలతో పాటు పలు కంపెనీలపై చైనా ఆంక్షలు విధిస్తూ వస్తోంది. చిన్నారులు వారంలో కేవలం కొన్ని గంటలపాటే వీడియో గేమ్లు ఆడుకునేలా ఈ మధ్యే ఆంక్షలు విధించారు. అంతేకాకుండా టీవీల్లో టాలెంట్ పోటీలను కూడా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు పలు కీలక రంగాల్లో చైనా అధికారులు నిబంధనలు కఠినతరం చేస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు నూతన స్టాక్ ఎక్ఛేంజీ ప్రకటన చేయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్