Booster Dose: భారత్లో బూస్టర్ డోసు.. కేంద్ర ప్రభుత్వం ఏమందంటే..!
భారత్లో ప్రస్తుతం కొవిడ్ను నిరోధించే బూస్టర్ డోసు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్నప్పటికీ కొవిడ్ ఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా కొత్త వేరియంట్లు వెలుగు చూస్తుండటంతో పలు దేశాలు బూస్టర్ డోసు (Booster Dose) ఇచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో భారత్లో ప్రస్తుతం బూస్టర్ డోసు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిపై శాస్త్రీయ చర్చతో పాటు ప్రజారోగ్య విభాగంలో బూస్టర్ డోసు ప్రధానాంశం కాదని అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశంలో రెండు డోసులు తీసుకోవడమే అతి ముఖ్యమైన అంశమని స్పష్టం చేసింది.
‘యాంటీబాడీల స్థాయిలను అంచనా వేయకూడదని చాలా సంస్థలు సిఫార్సు చేశాయి. కానీ, రెండు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకోవడం మాత్రం కచ్చితంగా అవసరం.. అందులో ఎటువంటి సందేహం లేదు’ అని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ వెల్లడించారు. ఇప్పటికే 20శాతం మంది పూర్తి మోతాదులో వ్యాక్సిన్ తీసుకోగా.. 63శాతం మంది కనీసం ఒక డోసు టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. అంతేకాకుండా 99శాతం మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది ఒక డోసు తీసుకోగా.. 82శాతం మంది రెండు డోసులు తీసుకున్నట్లు తెలిపారు. సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, గోవా, ఛండీగఢ్, లక్షద్వీప్ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో అర్హులందరూ కనీసం ఒక డోసు తీసుకున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో బూస్టర్ డోసు చర్చ అవసరంలేదని పేర్కొన్నారు.
ఇక కొత్త వేరియంట్ల ప్రభావం అధికంగా ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇప్పటికే బూస్టర్ డోసు పంపిణీని మొదలు పెట్టాయి. బ్రిటన్తో పాటు ఈయూలోని చాలా దేశాల్లో బూస్టర్ డోసు ఇవ్వాలని నిర్ణయిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) మాత్రం బూస్టర్ డోసు వినియోగం ఇప్పుడే వద్దంటోంది. కేవలం దీర్ఘకాల వ్యాధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికే ఇవ్వాలని పేర్కొంది. పేద దేశాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ధనిక దేశాలు మరికొన్ని నెలలపాటు బూస్టర్ డోసుకు దూరంగా ఉండాలని సూచిస్తోంది. అయినప్పటికీ సంపన్న దేశాలు మాత్రం బూస్టర్ డోసు పంపిణీకే మొగ్గుచూపుతున్నాయి.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. నిత్యం 60లక్షలకు పైగా డోసులను అందిస్తున్నారు. ఇప్పటివరకు 76కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న ఒక్క రోజే 35లక్షల డోసులను పంపిణీ చేసేందుకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్