R-value Drops: ఊరట కలిగిస్తోన్న ఆర్ ఫ్యాక్టర్..!
కరోనా వైరస్ సంక్రమణ రేటును సూచించే ఆర్-ఫ్యాక్టర్ ప్రస్తుతం తక్కువగానే ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నారు. ఆగస్టు మొదటి వారంలో ఆర్-ఫ్యాక్టర్ విలువ 1 కంటే ఎక్కువగా ఉండగా.. ప్రస్తుతం అది క్రమంగా తగ్గుతున్నట్లు పరిశోధకులు అంచనా వేశారు.
ఐదు రాష్ట్రాల్లోనే వైరస్ సంక్రమణ రేటు అధికం
దిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని.. మరికొంత కాలం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా థర్డ్ వేవ్ కూడా అనివార్యమని.. దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని సూచిస్తోంది. ఈ సమయంలోనే కరోనా వైరస్ సంక్రమణ రేటును సూచించే ఆర్-ఫ్యాక్టర్ ప్రస్తుతం తక్కువగానే ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నారు. ఆగస్టు మొదటి వారంలో ఆర్-ఫ్యాక్టర్ విలువ 1 కంటే ఎక్కువగా ఉండగా.. ప్రస్తుతం అది క్రమంగా తగ్గుతున్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. ముఖ్యంగా మూడో ముప్పు సమీపిస్తోందని వస్తోన్న వార్తల నేపథ్యంలో ఆర్-ఫ్యాక్టర్ క్షీణించడం ఊరట కలిగించే విషయం.
కొవిడ్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతోన్న వేగాన్ని ఆర్-ఫ్యాక్టర్ (రీ ప్రొడక్షన్ రేట్) ద్వారా అంచనా వేస్తారు. ఇందులో భాగంగా దేశంలో కరోనా వైరస్ సంక్రమణపై చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ (IMS) ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తోంది. ఆగస్టు మొదటి వారంలో జరిపిన అధ్యయనంలో ఆర్ విలువ 1 దాటినట్లు ఐఎంఎస్ వెల్లడించింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఆర్ఫ్యాక్టర్ 1 కంటే ఎక్కువగా నమోదు కావడం ఆందోళకరంగా పేర్కొంది. తాజాగా ఆగస్టు 14-16 తేదీల్లో సమాచారాన్ని విశ్లేషించగా ఈ విలువ 0.9కి క్షీణించిందని ఐఎంఎస్ నిపుణులు సిత్బారా సిన్హా వెల్లడించారు. దీని ద్వారా వైరస్ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు సంక్రమించే రేటు తక్కువగా ఉన్నట్లు అర్థమవుతోందని తెలిపారు. ఆర్ విలువ తక్కువగా ఉండడం ఉపశమనం కలిగించే విషయమేనని అన్నారు.
ఆ ఐదు రాష్ట్రాల్లో అధికం..
దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత కాస్త అదుపులోనే ఉన్నప్పటికీ కేరళలో మాత్రం విజృంభిస్తోంది. నిత్యం రికార్డు స్థాయిలో 20వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో క్రియాశీల కేసులు అక్కడే ఎక్కువగా ఉండగా.. ఆర్ విలువ 1 కంటే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించింది. తాజాగా కేరళలో కూడా ఆర్ ఫ్యాక్టర్ 1 కంటే తక్కువగానే నమోదైనట్లు ఐఎంఎస్ పరిశోధకులు వెల్లడించారు. వైరస్ దాటికి వణికిపోయిన మహారాష్ట్రలోనూ ఆర్ విలువ 0.89గా నమోదైంది. అటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఆర్ విలువ క్షీణిస్తుండగా.. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్లో ఆర్ ఫ్యాక్టర్ 1కి చేరువలో ఉంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఆర్ ఫ్యాక్టర్ 1 కంటే ఎక్కువగా ఉంది. ఇక ప్రధాన నగరాల్లో చూస్తే.. ముంబయి (0.70), దిల్లీ (0.85), బెంగళూరు (0.94), చెన్నై (0.97)లో 1కి దగ్గరగా ఉండగా.. కోల్కతా (1.08), పుణె (1.05) నగరాల్లో ఆర్ విలువ 1కంటే అధికంగా ఉంది.
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతికి చాలా రాష్ట్రాలు వణికిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వైరస్ సంక్రమణ రేటును సూచించే ఆర్-ఫ్యాక్టర్ అధికంగా ఉండడం ఆందోళన కలిగించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరస్ ఉద్ధృతి కాస్త తగ్గినప్పటికీ ఐదు రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్టర్ 1 కన్నా అధికంగా ఉండడం ఆందోళన కలిగించే విషయమని నిపుణులు సూచిస్తున్నారు. అటు కేరళ, తమిళనాడులోని పలు జిల్లాల్లో వైరస్ సంక్రమణ రేటు అధికంగానే ఉందని హెచ్చరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.