Petrol Price: వ్యాట్ను తగ్గించిన దిల్లీ.. లీటరుపై రూ.8 తగ్గిన పెట్రోల్!
దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్పై ప్రస్తుతం 30శాతంగా ఉన్న వ్యాట్ను 19.40శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఆమ్ఆద్మీ ప్రభుత్వం నిర్ణయం
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్పై ప్రస్తుతం 30శాతంగా ఉన్న వ్యాట్ను 19.40శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కేజ్రీవాల్ అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్ ధర ఒక్కసారిగా రూ.8 తగ్గనుంది. తగ్గిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.103.97గా ఉండగా.. డీజిల్ ధర రూ.86.67గా ఉంది. తాజాగా రూ.8 తగ్గడంతో లీటరు పెట్రోల్ రూ.95కే లభించనుంది. అయితే, గతేడాది జులైలో పెట్రోల్పై వ్యాట్ను 30శాతానికి, డీజిల్పై 16.75శాతానికి దిల్లీ ప్రభుత్వం పెంచింది. అనంతరం ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. తాజాగా వీటిని సమీక్షించిన ప్రభుత్వం.. పెట్రోల్పై వ్యాట్ను 19శాతానికి తగ్గించింది.
ఇప్పటికే నవంబర్ 4న ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అదే బాటలో పయనించిన పలు రాష్ట్రాలు వ్యాట్ను కూడా తగ్గించాయి. దీంతో ఇంధన ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాట్ను తగ్గించినప్పటికీ.. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు మాత్రం ఎటువంటి తగ్గింపు నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు వందకుపైగానే ఉన్నాయి. తాజాగా వ్యాట్ను తగ్గిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వ ప్రకటించింది.
ఇదిలాఉంటే, క్రితం నెలలో ఇంధన ధరలు దాదాపు 23సార్లు పెరిగి రికార్డు స్థాయికి దూసుకెళ్లాయి. గడిచిన 27 రోజులుగా మాత్రం ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించకపోవడంతో పెట్రోల్ ధరలు 110కి చేరువలోనే ఉండిపోయాయి. హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.108 ఉండగా.. డీజిల్ ధర 94గా ఉంది. ఏపీలోనూ దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. ముంబయిలో పెట్రోల్ లీటరు రూ.109.98కు విక్రయిస్తుండగా.. డీజిల్ మాత్రం 94.14గా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. రన్వేపై వీడియో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!