AY.4.2 వేరియంట్: లక్షణాలు తక్కువ.. వ్యాప్తి ఎక్కువ!
ఏవై.4.2 రకానికి వ్యాప్తిచెందే గుణం ఎక్కువగా ఉన్నప్పటికీ లక్షణాలు మాత్రం తక్కువగానే ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.
బ్రిటన్ అధ్యయనంలో వెల్లడి
లండన్: బ్రిటన్లో వెలుగు చూసిన ఏవై.4.2 (AY.4.2) కొత్తరకం వేరియంట్ విస్తృత వ్యాప్తి చెందుతున్నట్లు పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఈ వేరియంట్ను వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్గా పేర్కొన్న పలు దేశాలు.. వైరస్ తీవ్రతను అంచనా వేసేందుకు అధ్యయనాలు మొదలుపెట్టాయి. ఇందులోభాగంగా ఏవై.4.2 రకానికి వ్యాప్తిచెందే గుణం ఎక్కువగా ఉన్నప్పటికీ లక్షణాలు మాత్రం తక్కువగానే ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. వైరస్ వ్యాప్తి, వాటి ప్రభావాలను అంచనా వేసేందుకు బ్రిటన్లో జరిపిన వాస్తవ ఫలితాల విశ్లేషణలో ఈ విషయం తేలింది.
పలు దేశాల్లో తీవ్ర ప్రభావం చూపిన డెల్టా వేరియంట్ (Delta Variant).. రూపాంతరం చెంది ఏవై.4.2 రకంగా వ్యాప్తిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైరస్ ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు ఇంపీరియల్ కాలేజీ లండన్, ఇప్సోస్ మోరీ (Ipsos MORI) పరిశోధకులు వాస్తవ ఫలితాలను విశ్లేషించారు. ఇందుకోసం అక్టోబర్ 19 నుంచి నవంబర్ 5 వరకు ఇంగ్లాండ్లో లక్ష మంది కొవిడ్ అనుమానితుల నుంచి నమూనాలను సేకరించి విశ్లేషించారు. తద్వారా ఏవై.4.2 వేరియంట్ నిత్యం 2.8శాతం పెరుగుదల రేటుతో వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. ఇంగ్లాండ్లో వైరస్ ఉద్ధృతికి ఇదే ప్రధాన కారణమనే నిర్ధారణకు వచ్చారు.
లక్షణాలు తక్కువే..
ఏవై.4.2 వేరియంట్ సోకిన వారిలో రుచి, వాసన కోల్పోవడం, జ్వరం, దగ్గుతో పాటు వర్గీకరించిన కొవిడ్ లక్షణాలు (Covid Symptoms) తక్కువగానే కనిపించినట్లు పరిశోధకులు వెల్లడించారు. డెల్టా రకం సోకిన వారిలో 46శాతం లక్షణాలు కనిపించగా.. ఏవై.4.2 రకం నిర్ధారణైన వారిలో కేవలం 33శాతం మందిలోనే లక్షణాలు కనిపించాయి. అయితే, ‘వైరస్ విస్తృతంగా ఎందుకు వ్యాపిస్తుందో మాకు తెలియదు. తక్కువ లక్షణాలు మాత్రమే ఉన్నట్లు కనిపించింది’ అని ఇంపీరియల్ కాలేజీ ప్రజారోగ్య విభాగానికి చెందిన ప్రొఫెసర్ పాల్ ఎల్లియోట్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్లో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు కనిపించినప్పటికీ ఇన్ఫెక్షన్ రేటు మాత్రం అధికంగానే ఉందన్నారు. గతంలో గరిష్ఠంగా నమోదైన కొవిడ్ కేసులు, మరణాలతో పోలిస్తే వాటి సంఖ్య కాస్త తక్కువగా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా వైరస్ ఉద్ధృతి అధికంగా ఉందని ప్రొఫెసర్ పాల్ స్పష్టం చేశారు. ముఖ్యంగా పిల్లలు పాఠశాలలకు వెళుతున్న వేళ.. వైరస్ ప్రాబల్యం మరోసారి మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అంచనా వేశారు.
బూస్టర్తో రక్షణ..
ఇక వైరస్ను ఎదుర్కోవడంలో బూస్టర్ డోసుల సమర్థతపైనా లండన్ పరిశోధకులు దృష్టి పెట్టారు. ఇప్పటికే చాలా మందికి బూస్టర్ డోసులు అందించగా.. రెండు డోసులు పొందినవారితో పోలిస్తే మూడోడోసు తీసుకున్న వారికి ఇన్ఫెక్షన్ ముప్పు మూడురెట్లు తక్కువగా ఉందని గుర్తించారు. ప్రస్తుతం అక్కడ 50ఏళ్ల వయసుపైబడిన వారికి మూడో డోసు అందిస్తున్నారని.. ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పించడంలో ఇవి ఎంతగానో దోహదం చేస్తున్నాయని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జెన్నీ హారిస్ పేర్కొన్నారు. ఏదేమైనా వ్యాక్సిన్ పంపిణీ మొదలుపెట్టిన నుంచి కొవిడ్ మరణాల్లో గణనీయమైన తగ్గుదల కనిపించిందని మరో శాస్త్రవేత్త క్రిసిల్ డోనెలీ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే