Corona: మహమ్మారి కొత్త పద్ధతిలో వేగంగా తిరిగివస్తోంది..! 

ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా కోరలు చాస్తోంది. మరీ ముఖ్యంగా ఐరోపా కేంద్రంగా విజృంభిస్తోంది. అందులోనూ జర్మనీ పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడ కరోనా వైరస్ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉద్ధృతి చూపిస్తోంది. తాజాగా 50,196 కొత్త కేసులు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

Updated : 11 Nov 2021 17:08 IST

జర్మనీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు 

బెర్లిన్‌: ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా కోరలు చాస్తోంది. మరీ ముఖ్యంగా ఐరోపా కేంద్రంగా విజృంభిస్తోంది. అందులోనూ జర్మనీ పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడ కరోనా వైరస్ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉద్ధృతి చూపిస్తోంది. తాజాగా 50,196 కొత్త కేసులు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

జర్మనీలో కరోనా వైరస్ అడుగుపెట్టిన దగ్గరి నుంచి 50 వేల కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. అలాగే అక్టోబర్ మధ్యనుంచి అక్కడ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ఇవి అనూహ్యరీతిలో వెలుగుచూస్తున్నాయని జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘కరోనా మహమ్మారి కొత్త పద్ధతిలో వేగంగా తిరిగొస్తోంది. తగిన కట్టడి చర్యలతో వైరస్‌ను అదుపులోకి తీసుకురావాలి’ అని మెర్కెల్ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. 

కాగా తాజా పరిస్థితికి వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండటమూ ఓ కారణమని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో పూర్తిగా 67 శాతం మంది టీకా వేయించుకున్నారు. అర్హులంతా టీకా వేయించుకోవాలని, టీకా తీసుకోనివారిలోనే ఎక్కువగా కేసులు వెలుగుచూస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. దాంతో టీకా తీసుకోని వారిని బార్లు, రెస్టారెంట్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లోకి అనుమతించకుండా బెర్లిన్ నిషేధాజ్ఞలు విధించింది.

మరోపక్క కొత్త కేసుల కారణంగా ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. ఇతర వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం జర్మనీలో 48లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా.. 97,599 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని