Fake Vaccines: నకిలీ టీకాలను గుర్తించడం ఎలాగంటే..!
దేశంలో నకిలీ టీకాలపై అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుతం వినియోగిస్తోన్న వ్యాక్సిన్ల ప్రామాణికతపై రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.
రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు
దిల్లీ: కరోనా వైరస్ మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. పంపిణీ ప్రక్రియను కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో నకిలీ టీకాలు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి నకిలీ టీకాలపై ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దేశంలో నకిలీ టీకాలపై అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుతం వినియోగిస్తోన్న వ్యాక్సిన్ల ప్రామాణికతపై రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.
కొవిషీల్డ్కు చెందిన నకిలీ టీకాలు ఆసియా, ఆఫ్రికా మార్కెట్లోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. వీటితో పాటు దేశంలోనూ పలుచోట్ల ఇటువంటి టీకాలు వాడుకలో ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తూ మీడియాలో కథనాలు వెలుబడ్డాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటిపై దర్యాప్తును ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. కరోనా వ్యాక్సిన్ అసలైనదా? నకిలీదా అనే విషయాన్ని సులువుగా తెలుసుకునేందుకు రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ప్రస్తుతం దేశంలో వినియోగిస్తోన్న కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్-వి టీకాల తయారీ సంస్థలకు సంబంధించి.. ఆయా బాటిళ్లపై లేబుల్, రంగుతో పాటు తయారీ సంస్థల సమాచారం గురించిన వివరాలను తెలియజేస్తూ రాష్ట్రాలకు లేఖ రాసింది.
కొవిషీల్డ్:
* SII (సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా) పేరుతో లేబుల్
* కొవిషీల్డ్ బ్రాండ్ పేరు.. ట్రేడ్ మార్కు(TM) గుర్తు
* సాధారణ ఫాంటులో(Bold కాకుండా) జనరిక్ (సాంకేతిక పేరు) పేరు
* జనరిక్ పేరు కింద బ్రాకెట్లో అదే ఫాంటులో ‘Recombinant’
* స్టిక్కర్పైన ఎరుపు రంగులో CGS Not For Sale అనే స్టాంపు
* ముదురు ఆకుపచ్చ రంగులో లేబుల్.. దానిపైన తెలుపు రంగులో ముద్రించిన అక్షరాలు
* ఆకుపచ్చ రంగులో అల్యూమినియంతో కూడిన బాటిల్ మూత
కొవాగ్జిన్:
* లేబుల్పైన డీఎన్ఏ మాదిరిగా కనిపించే గుర్తులు (అతినీలలోహిత కిరణాలతో మాత్రమే కనిపించే వీలు)
* లేబుల్ మీద అతిచిన్న చుక్కల రూపంలో కొవాగ్జిన్ అనే పేరు
* COVAXIN పేరులో X అక్షరం తొలి సగభాగం ముదురు ఆకుపచ్చ రంగులో ప్రత్యేకంగా కనిపిస్తుంది
* COVAXIN హోలోగ్రామ్
స్పుత్నిక్-వి:
రష్యాలో అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ భారత్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అయితే, తొలుత వీటిని రష్యా నుంచి దిగుమతి చేసుకోగా ప్రస్తుతం దేశీయంగానే తయారు అవుతున్నాయి.
* రెండు బాటిళ్ల డిజైన్, వాటిపై సమాచారం మాత్రం ఒకటే
* తయారీ సంస్థ పేరు మాత్రం వేర్వేరు
* టీకా బాక్సు (ఒక్కో దాంట్లో 5 ఇంజక్షన్ సీసాలు) ముందు, వెనక భాగాల్లో సమాచారం ఇంగ్లీష్లోనే ఉంటుంది
* సీసా లేబుల్పై మాత్రం రష్యా భాషలో సమాచారం
ఇలా ఆయా తయారీ సంస్థల సమాచారం, వయల్స్ రంగు, ట్రేడ్మార్కుతో పాటు లేబుల్పై కొన్ని ప్రత్యేక గుర్తులను బట్టి అసలైన బాటిల్ను తేలికగా గుర్తించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇవి కాకుండా ఇతర రూపాల్లో కనిపిస్తే వాటిని సందేహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించడంపై ఆప్ స్పందించింది. ఆయనను చంపేందుకు కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేసింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. -
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
లోక్సభ ఎన్నికల తొలి దశకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 సీట్లకు శుక్రవారం (ఏప్రిల్ 19న) పోలింగ్ నిర్వహించనున్నారు. -
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
ద్రవిడనాట పట్టు బిగించాలనే సంకల్పంతో ఉన్న ప్రధాని మోదీ.. ఆ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విస్తృత పర్యటన చేశారు. -
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
Dubai Rains: దుబాయ్లో చిక్కుకున్న భారతీయుల కోసం అక్కడి మన దౌత్య కార్యాలయం హెల్ప్లైన్ నంబర్లు విడుదల చేసింది. -
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నట్టుగా ఇటీవల బాలీవుడ్ నటుడు ఆమిర్ఖాన్ వీడియో వైరల్ కాగా, తాజాగా రణ్వీర్సింగ్కు అదే పరిస్థితి ఎదురైంది. -
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
మహిళా రెజ్లర్లు తనపై చేస్తున్న లైంగిక ఆరోపణల కేసులో మరింత విచారణ జరపాలని కోరుతూ బ్రిజ్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలోనే న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. -
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ నౌకా సిబ్బందిలో కేరళ మహిళను విడుదల చేశారు. దీంతో ఆమె నేడు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. -
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
రామేశ్వరం కెఫే బ్లాస్ట్ కేసులో నిందితుల నుంచి కీలక వివరాలు బయటపడుతున్నాయి. వారు ఈ దాడి కుట్రకు వాడేసిన పాత ఫోన్లనే వినియోగించినట్లు తేలింది. -
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
అంతరిక్షం కూడా భవిష్యత్ యుద్ధాలకు వేదికగా మారిందని భారత త్రివిధ దళాల అధిపతి (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. -
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
Arvind Kejriwal: బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ పెంచుకునేందుకు స్వీట్లు, మామిడి పండ్లను తింటున్నారని కోర్టుకు తెలిపింది. -
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. -
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియాశ్రీనేత్
కాంగ్రెస్ (Congress) నేత సుప్రియా శ్రీనేత్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది. -
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు