Third wave: మూడోముప్పు సూచనలు కనిపిస్తున్నాయి..!
గత కొంతకాలంగా కరోనా థర్డ్వేవ్పై ఆందోళనలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్లో థర్డ్వేవ్ రానుందనే నివేదికలు వెలువడుతున్నాయి. అక్టోబర్లో మూడోముప్పు గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చని కేంద్రం నేతృత్వంలోని కమిటీ ఇదివరకే వెల్లడించింది. ఈ క్రమంలో ఐసీఎంఆర్కు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ సమిరన్ పాండా పలు కీలక విషయాలు వెల్లడించారు.
అంచనా వేసిన ఐసీఎంఆర్
దిల్లీ: గత కొంతకాలంగా కరోనా థర్డ్వేవ్పై ఆందోళనలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్లో థర్డ్వేవ్ రానుందనే నివేదికలు వెలువడుతున్నాయి. అక్టోబర్లో మూడోముప్పు గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చని కేంద్రం నేతృత్వంలోని కమిటీ గతంలోనే వెల్లడించింది. ఈ క్రమంలో ఐసీఎంఆర్కు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ సమిరన్ పాండా పలు కీలక విషయాలు వెల్లడించారు.
సెకండ్ వేవ్ తీవ్రత పెద్దగా లేని రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయని సమిరన్ పాండా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ట్రెండ్ థర్డ్వేవ్ ప్రారంభ సంకేతాలను చూపుతుందని హెచ్చరించారు. ‘సెకండ్వేవ్ ప్రారంభ దశలో అనేక రాష్ట్రాలు ఆంక్షలు విధించడంతో పాటు టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేశాయి. అలాగే దిల్లీ, మహారాష్ట్ర పరిస్థితుల నుంచి నేర్చుకున్నాయి. ఈ కారణాలతో ఆ రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ అంత తీవ్రతను చూపలేదు. అయితే, ఇప్పుడు మూడోముప్పునకు అక్కడ అవకాశం ఉంది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతోన్న కేసులు కూడా ఈ పరిస్థితికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. కొవిడ్ కేసుల సంఖ్య, గత రెండు దఫాల్లో వైరస్ విజృంభణ ఆధారంగా థర్డ్వేవ్పై సిద్ధంకావాల్సి ఉందన్నారు.
అలాగే ఈ సమయంలో పలు రాష్ట్రాలు విద్యాసంస్థల పునఃప్రారంభంపై ఆలోచనలు చేస్తున్నాయి. దీనిపై పాండా స్పందించారు. ‘ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బంది, బస్సు డ్రైవర్లు, కండక్టర్లు అందరూ టీకాలు పొందాల్సి ఉంది. అలాగే కొవిడ్ నియమావళిని పాటించాలి. సెకండ్ వేవ్తో తీవ్ర ప్రభావానికి గురైన రాష్ట్రాలు పాఠశాలలను తెరవచ్చు. అదే సమయంలో వైరస్ ఉద్ధృతిని అంతగా చవిచూడని రాష్ట్రాలు మాత్రం క్రమంగా పాఠశాలలు తెరవడంపై దృష్టిసారించాలి’ అని సూచించారు. అలాగే జాతీయ స్థాయిలో నిర్వహించిన నాలుగో సీరోసర్వే ప్రకారం.. 50 శాతం కంటే ఎక్కువ మంది పిల్లలు వైరస్ బారినపడినట్లు స్పష్టమైందన్నారు. పెద్దలకంటే కొంచెమే తక్కువ కాబట్టి, అనవసర భయానికి గురికావొద్దని చెప్పారు.
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మూడోముప్పునకు అవకాశం ఉందని ఎస్బీఐ నివేదిక, కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ గతంలోనే వెల్లడించాయి. మరోపక్క పండుగల సీజన్ ప్రారంభమైంది. ఈ సమయంలో కొవిడ్ నియమావళిని నిర్లక్ష్యం చేస్తే.. సూపర్ స్ప్రెడర్ ఘటనలు వెలుగుచూస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత 24 గంటల వ్యవధిలో 30 వేల కొత్త కేసులు వెలుగుచూడగా.. 350 మంది ప్రాణాలు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
సంక్షిప్త వార్తలు
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?