India Corona : 260 రోజుల కనిష్ఠానికి క్రియాశీల కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. రెండో రోజూ కేసులు 11 వేలకు దిగువనే నమోదయ్యాయి.

Updated : 29 Jun 2023 16:36 IST

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. రెండో రోజూ కేసులు 11 వేలకు దిగువనే నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రాలు మరణాల సంఖ్యను సవరిస్తుండటంతో ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. నిన్న 500కుపైగా మరణాలు నమోదయ్యాయి. ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

* నిన్న 9,19,996 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 10,853 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.

* గడిచిన 24 గంటల్లో కరోనాతో 526 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 4,60,791కి చేరింది.

* కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. నిన్న 12,432 మంది కరోనాను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3.37 కోట్లు(98.24 శాతం) దాటింది.

* ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 144845(0.42%)కి తగ్గి.. 260 రోజుల కనిష్ఠానికి  చేరింది.

* ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కాస్త నెమ్మదిగా సాగుతోంది. నిన్న 28,40,174 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ అందించిన టీకా డోసుల సంఖ్య 108 కోట్లు దాటింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని