India Corona : 10 వేలకు దిగొచ్చిన కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు మరోసారి పదివేలకు దిగివచ్చాయి.

Updated : 15 Nov 2021 11:48 IST

భారీగా తగ్గిన మరణాలు..

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు మరోసారి పదివేలకు దిగివచ్చాయి. మరోవైపు మరణాల సంఖ్యలో కూడా భారీ తగ్గుదల కనిపించడం ఊరట కలిగిస్తోంది. ఇక రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉండటంతో.. క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..

* గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,15,198 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 10,229 కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇందులో ఒక్క కేరళ నుంచే సగానికి పైగా ఉన్నాయి. ఆ రాష్ట్రంలో నిన్న 5,848 కేసులు.. 46 మరణాలు చోటుచేసుకున్నాయి.

* గత కొన్ని రోజులుగా మరణాల సంఖ్య ఎక్కువగా నమోదవుతుండగా.. తాజాగా ఆ సంఖ్య 125కి తగ్గింది. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,63,655కి చేరింది.

* నిన్న 11,926 మంది కరోనాను జయించారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3.38 కోట్లు దాటి ఆ రేటు 98.26 శాతానికి పెరిగింది.

* ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,34,096(0.39 శాతం)కు తగ్గి.. 523 రోజుల కనిష్ఠానికి చేరింది.

* దేశంలో ఇన్న 30,20,119 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,12,34,30,478కి చేరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని