India Corona: అదుపులో కరోనా మహమ్మారి..!

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. తాజాగా 11,38,699 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,106 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 459 మంది ప్రాణాలు కోల్పోయారు.

Published : 19 Nov 2021 10:04 IST

కొత్తగా 11 వేల మందికి వైరస్‌ పాజిటివ్‌

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. తాజాగా 11,38,699 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,106 మందికి వైరస్ సోకినట్లు తేలింది. 459 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క కేరళలోనే 6,111 కొత్త కేసులు, 372 మరణాలు సంభవించాయి. గత ఏడాది ప్రారంభం నుంచి 3.44 కోట్ల మంది కొవిడ్‌ సోకగా..4,65,082 మరణాలు సంభవించాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. 

గత కొద్దికాలంగా క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం బాధితుల సంఖ్య 1,26,620గా ఉంది. క్రియాశీల రేటు 0.37 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.28 శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే 12,789 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.38 కోట్లుగా ఉన్నాయి. ఇక నిన్న 72.9 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 115 కోట్ల మార్కును దాటింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని