India Corona: 10 లక్షల మందిని పరీక్షిస్తే.. 10 వేల మందికి వైరస్‌ పాజిటివ్‌

దేశంలో తాజాగా కరోనా కేసులు తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 10,72,863 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిచంగా..10,302 మందికి కరోనా సోకినట్లు వెల్లడైంది.

Updated : 20 Nov 2021 13:22 IST

531 రోజుల కనిష్ఠానికి క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో తాజాగా కరోనా కేసులు తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 10,72,863 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..10,302 మందికి కరోనా సోకినట్లు వెల్లడైంది. ముందురోజు కంటే 7 శాతం మేర కేసులు తగ్గాయి. 267 మరణాలు సంభవించాయి. మొత్తం కేసులు 3.45 కోట్లకు సమీపిస్తుండగా.. 4.65 లక్షల మరణాలు సంభవించాయని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉండటంతో క్రియాశీల కేసులు తగ్గుతూ, రికవరీలు పెరుగుతూ సానుకూల వాతావారణం కనిపిస్తోంది. ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 1,24,868(0.36 శాతం)కి తగ్గింది. ఈ సంఖ్య 531 రోజుల కనిష్ఠానికి పడిపోయింది. నిన్న 11,787 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.39 కోట్లకు చేరాయి. దాంతో రికవరీ రేటు 98.29 శాతానికి పెరిగింది. మరోపక్క నిన్న 51,59,931 మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 115 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని