India Corona: గతేడాది మే నాటి స్థాయికి తగ్గిన కేసులు..

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 10వేల దిగువన నమోదైన కొత్త కేసులు.. గతేడాది మే నాటి స్థాయికి పడిపోయాయి.

Updated : 22 Nov 2021 11:35 IST

534 రోజుల కనిష్ఠానికి క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 10వేల దిగువన నమోదైన కొత్త కేసులు.. గతేడాది మే నాటి స్థాయికి పడిపోయాయి. దాదాపు 538 రోజుల కనిష్ఠానికి క్షీణించాయి. ప్రస్తుతం 7,83,567 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,488 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అయితే ఈ తగ్గుదలకు పరీక్షల సంఖ్య కూడా కారణంగా కనిపిస్తోంది. మరోపక్క ఒక్క కేరళలోనే 5,080 మందికి కరోనా సోకింది. నిన్న 12,510 మంది కోలుకున్నారు. గత ఏడాది ప్రారంభం నుంచి 3.45 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా..3.39 కోట్ల మంది వైరస్‌ను జయించారని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది

24 గంటల వ్యవధిలో 249 మరణాలు సంభవించాయి. దాంతో మృతుల సంఖ్య 4,65,911కి చేరింది. గత కొద్దికాలంగా గణనీయంగా తగ్గుతోన్న క్రియాశీల కేసులు.. తాజాగా 1,18,443కి చేరాయి. బాధితుల సంఖ్య 534 రోజుల కనిష్ఠానికి తగ్గింది. ప్రస్తుతం క్రియాశీల రేటు 0.34 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.31 శాతంగా పెరిగింది. నిన్న 32,99,337 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు 116 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని