India Corona: 9వేలకు పైగా కరోనా కేసులు.. తగ్గిన రికవరీలు..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడిలోనే ఉంది. అయితే రోజువారీ కేసుల్లో మాత్రం హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. తాజాగా 11,08,467 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 9,765 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

Updated : 02 Dec 2021 12:21 IST

ఒక్క కేరళ నుంచే 400కు పైగా మరణాలు

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. అయితే, రోజువారీ కేసుల్లో మాత్రం హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. తాజాగా 11,08,467 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 9,765 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కేరళలో 5వేలమందికి పైగా కరోనా బారినపడ్డారు. ముందురోజుతో పోల్చితే 9 శాతం అధికంగా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న 8,548 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 99,763(0.29 శాతం) క్రియాశీల కేసులున్నాయని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. 

గత ఏడాది కాలం నుంచి 3.46 కోట్ల మందికి కరోనా సోకింది. వారిలో 3.40 కోట్ల(98.35 శాతం)మంది కోలుకున్నారు. 4,69,724 మంది మృతి చెందారు. 24 గంటల వ్యవధిలో 477 మరణాలు నమోదయ్యాయి. ఒక్క కేరళలో నుంచే 403 మరణాలు వెలుగుచూశాయి. ఇక నిన్న 80 లక్షల మందికి పైగా టీకా వేయించుకోగా.. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 124 కోట్ల మార్కును దాటింది.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని