America: విదేశీ విద్యార్థులకు విమాన కష్టాలు!
వీసా జారీ ఆలస్యం కావడంతో పాటు, అమెరికా వెళ్లేందుకు విమాన సర్వీసులు తక్కువగా ఉండడం విద్యార్థులను వేధిస్తోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారత్, చైనా విద్యార్థులు ఛార్టర్ ఫ్లైట్లను ఆశ్రయించాల్సి వస్తోంది.
ఛార్టర్ విమానాలను ఆశ్రయిస్తోన్న భారత్, చైనా విద్యార్థులు
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టిస్తోన్న విలయం విదేశీ విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునే వారికి తీవ్ర నిరాశ కలిగిస్తోంది. కొవిడ్ ఉద్ధృతి సమయంలో అమెరికాలో చదువుతున్న విద్యార్థులు తమ స్వస్థలాలకు రాగా.. తాజాగా అక్కడ కొవిడ్ ఉద్ధృతి తగ్గడంతో మళ్లీ తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వీరికితోడు ఈ ఏడాది కొత్తగా అడ్మిషన్ తీసుకోవాలనుకునే వారికి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వీసా జారీ ఆలస్యం కావడంతో పాటు, అమెరికా వెళ్లేందుకు విమాన సర్వీసులు తక్కువగా ఉండడం వారిని వేధిస్తోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారత్, చైనా విద్యార్థులు ఛార్టర్ ఫ్లైట్లను ఆశ్రయించాల్సి వస్తోంది.
ఓవైపు వీసా జారీలో ఆలస్యం..
అమెరికాలో ఉన్నతవిద్య కోసం ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10లక్షల మంది విదేశీ విద్యార్థులు వెళ్తుంటారు. వీరిలో చైనా, భారత్ల నుంచే అధికంగా ఉంటారు. ప్రస్తుతం అక్కడి యూనివర్సిటీల్లో అడ్మిషన్లు ప్రారంభం కావడంతో విద్యార్థులు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా భారత విద్యార్థులకు వీసా జారీలో తీవ్ర ఆలస్యం అవుతోంది. ఇక్కడి రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో అమెరికా సిబ్బంది తక్కువగా ఉండటమే కారణంగా తెలుస్తోంది. కరోనా విజృంభిస్తోన్న వేళ కాన్సులేట్ సిబ్బంది అమెరికాకు వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం వీసా అపాయింట్మెంట్ల కోసం భారత విద్యార్థులు వేచిచూడాల్సి వస్తోంది. అంతేకాదు వీసా రాకముందే అమెరికా ప్రయాణానికి ముందస్తుగా విమాన టికెట్ బుక్ చేసుకున్న వారికి ఇది మరింత కష్టంగా మారింది. వీటితోపాటు ఆయా దేశాల్లో అనుసరిస్తోన్న వ్యాక్సిన్ విధానం కూడా విదేశాల్లో చదువుకునే భారత విద్యార్థులకు సమస్యగా మారింది.
మరోవైపు విమాన కష్టాలు..
వీసా జారీలో ఇబ్బందులు ఇలా ఉంటే, మరోవైపు ఇప్పటికే అక్కడ అడ్మిషన్ పొందిన విద్యార్థులతో పాటు తిరిగి వెళ్లేందుకు సిద్ధమైన పూర్వ విద్యార్థులు తీవ్రంగా ఎదురుచూడాల్సి వస్తోంది. ముఖ్యంగా అమెరికాకు విమాన సర్వీసులు భారీగా తగ్గిపోవడమే ఇందుకు కారణం. చైనా నుంచి 2019 జులైలో దాదాపు 1626 విమాన సర్వీసులు (4లక్షల 79వేల సామర్థ్యం) నడవగా.. ఈ ఏడాది కేవలం 61 విమాన సర్వీసులు(20వేల సీట్లు) మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారత్లోనూ ఇదే పరిస్థితి. మరోవైపు విమాన ఛార్జీలు విపరీతంగా పెరగడం విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. గతంతో పోలిస్తే దాదాపు 5రెట్లు ఎక్కువగా ప్రయాణ ఛార్జీ చెల్లించాల్సి వస్తోందని చైనా, భారత్ విద్యార్థులు వాపోతున్నారు. వీటిని భరించేందుకు సిద్ధమైనప్పటికీ ప్రయాణ సమయానికి విమాన సర్వీసులు రద్దు అవుతుండడం మరో సమస్యగా మారింది. దీంతో ఛార్టర్ ఫ్లైట్లను ఆశ్రయిస్తున్నట్లు చైనీస్ స్టూడెంట్స్ అసోసియేషన్ పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో భారత విద్యార్థులు కూడా ఛార్టర్ విమానాలవైపు మొగ్గుచూపుతున్నారు.
అమెరికాలో చదువులపై అంతర్జాతీయంగా ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. ఇలా లక్షల మంది అక్కడ చదువుకోవడం వల్ల అమెరికా ప్రభుత్వానికి ప్రతిఏటా వేల కోట్ల రూపాయలు (దాదాపు 38బిలియన్ డాలర్లు) ఆదాయంగా వస్తోంది. కానీ, కరోనా మహమ్మారి వల్ల అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులు కఠిన సమయాన్ని ఎదుర్కొంటున్నారని న్యూయార్క్లోని కార్నెల్ యూనివర్సిటీలోని అంతర్జాతీయ వ్యవహారాల ఇంఛార్జ్గా ఉన్న ప్రొఫెసర్ వెండీ వోల్ఫోర్డ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు ఉమ్మడిగా లేఖ రాశారు. -
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..