Swachh Survekshan Awards: అత్యంత పరిశుభ్ర రాష్ట్రం, నగరం ఏవో తెలుసా..?
మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం వరుసగా ఐదోసారి అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. సూరత్(గుజరాత్), విజయవాడ(ఏపీ) తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి.
స్వచ్ఛ సర్వేక్షణ్- 2021 అవార్డులను అందజేసిన రాష్ట్రపతి
దిల్లీ: మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం వరుసగా ఐదోసారి అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. సూరత్(గుజరాత్), విజయవాడ(ఏపీ) తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. ఈ మేరకు శనివారం విజ్ఞాన్భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ‘స్వచ్ఛ సర్వేక్షణ్- 2021’ అవార్డులను అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఈ క్లీన్లీనెస్ సర్వే నిర్వహించి, ఈ జాబితాను సిద్ధంగా చేస్తుంది. ఇప్పటివరకు ఆరుసార్లు అవార్డుల ప్రదానోత్సవం జరగ్గా, ఐదుసార్లు ఇండోర్ నగరమే మొదటి స్థానంలో నిలవడం విశేషం.
గత ఏడాది మాదిరిగానే సూరత్ రెండో స్థానాన్ని పదిలం చేసుకోగా, నవీ ముంబయిని వెనక్కి నెట్టి, విజయవాడ మూడో స్థానాన్ని దక్కించుకుంది. అలాగే ఛత్తీస్గఢ్ అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా నిలిచింది. అలాగే అత్యంత పరిశుభ్రమైన గంగా పరివాహక పట్టణంగా ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి చోటు సంపాదించుకుంది. ఇండోర్ వరుసగా మొదటిస్థానంలో నిలవడంపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి అక్కడి ప్రజలు, నాయకత్వానికి అభినందనలు తెలియజేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఇండోర్ వాసులకు అభినందనలుత తెలిపారు.
స్వచ్ఛ సర్వేక్షణ్- 2021 జాబితాలో మొదటి 10 నగరాలివే: ఇండోర్, సూరత్, విజయవాడ, నవీ ముంబై, పుణె, రాయ్పూర్, భోపాల్, వడోదర, విశాఖపట్నం, అహ్మదాబాద్. ఈ సర్వేలో దాదాపు 4,320 నగరాలు, పట్టణాలు పాల్గొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం