Canada Elections: కెనడా ప్రధాని.. హ్యాట్రిక్ విజయం..!
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మూడోసారి తన అధికారాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమయ్యారు. తాజాగా (సెప్టెంబర్ 20న) జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆయన విజయం ఖాయమైనట్లు అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి.
పూర్తి మెజారిటీ సాధించడంలో వెనకబడ్డ లిబరల్ పార్టీ
ఒట్టావా: కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మూడోసారి తన అధికారాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమయ్యారు. తాజాగా (సెప్టెంబర్ 20న) జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆయన విజయం ఖాయమైనట్లు అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే, సొంతంగా పూర్తి మెజారిటీ సాధించడంలో మాత్రం అధికార పార్టీ వెనుకబడింది. అధికార లిబరల్ పార్టీ, ప్రతిపక్ష కన్జర్వేటీవ్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నప్పటికీ చివరకు జస్టిన్ ట్రూడోనే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు ఎరిన్ ఒ టూలే తమ ఓటమిని అంగీకరించడంతో ప్రధాని జస్టిన్ ట్రూడో విజయం ఖాయమైంది.
కెనడా పార్లమెంటు (House of Commons)లో మొత్తం 338 సీట్లు ఉండగా.. విజయం సాధించాలంటే 170 సీట్లు పొందాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో అధికార పార్టీ 155 స్థానాలకే పరిమితమైంది. పూర్తి మెజారిటీ సాధించనప్పటికీ ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ పూర్తి మెజారిటీ సాధించడంలో విఫలమైంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం 156 స్థానాలు మాత్రమే పొందగలిగింది. ఇక ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ మాత్రం 121 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ ఓటమిని ఒప్పుకోవడంతో జస్టిన్ ట్రూడో మూడోసారి విజయానికి మార్గం సుగమమైంది.
ముందస్తు వ్యూహం..
కెనడాలో కొవిడ్-19 మహమ్మరిని సమర్థంగా కట్టడి చేశామని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పలుమార్లు పేర్కొన్నారు. మరోవైపు వ్యాక్సిన్ పంపిణీలోనూ ముందున్నామని చెప్పుకుంటున్న ట్రూడో.. కొవిడ్పై విజయం సాధించామనే ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా పూర్తి మెజారిటీ సాధించాలనే పట్టుదలతో ఉన్న జస్టిన్ ట్రూడో.. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ఆగస్టు నెలలో ప్రకటించారు. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంపై ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదే సమయంలో అఫ్గాన్ నుంచి కెనడియన్లను తరలించడంలోనూ ట్రూడో విఫలమయ్యారనే విమర్శలు మొదలయ్యాయి. ఇదే వ్యతిరేకతను ప్రతిపక్ష కన్జర్వేటర్లు అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. గత కొద్దిరోజులుగా వైరస్ మళ్లీ విజృంభించడాన్ని ప్రస్తావిస్తూ.. కొవిడ్ నియంత్రణలో ట్రూడో విఫలమయ్యారనే ప్రచారం చేశారు. ఇలా ఎన్నికలు సమీపించే నాటికి అధికార లిబరల్స్కు ఓటర్ల మద్దతు తగ్గగా.. కన్జర్వేటర్లకు మద్దతు పెరుగుతోందని సర్వేలు వెల్లడించాయి. ఇది ట్రూడోను కాస్త ఆందోళనకు గురిచేసినప్పటికీ చివరకు కెనడియన్లు ఆయనవైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
భారత సంతతి ప్రాతినిధ్యం అధికమే..!
ఇదిలాఉంటే, కెనడా పార్లమెంటు ఎన్నికల్లో భారతీయల ప్రాతినిధ్యం ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో దాదాపు 20మంది భారతీయ మూలాలున్న కెనడియన్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఈసారి కూడా దాదాపు 49మంది ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 16మంది కన్జర్వేటివ్ పార్టీ నుంచి కాగా.. మరో 15 మంది అధికార లిబరల్ పార్టీ నుంచి బరిలో దిగారు. ఇక జగ్మీత్ సింగ్కు చెందిన న్యూ డెమోక్రాటిక్ పార్టీ (NDP) నుంచి 12 మంది, ఇతర పార్టీల నుంచి మరో ఆరుగురు పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడ్డారు. ఇప్పటికే ప్రస్తుత కేబినెట్లో భారతీయ మూలాలున్న ముగ్గురు మంత్రులుగా ఉన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
PM Modi: ప్రచార సభలో తన తల్లి ఫొటోను చూసి ప్రధాని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. ఆ చిత్రాన్ని గీసిన యువకుడిని అభినందించారు. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: రేవంత్
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు