DART: భూగ్రహ రక్షణకు నాసా సరికొత్త ఆయుధం!
విశ్వంలో గ్రహాలతో పాటే అనేక గ్రహశకలాలూ ఉన్నాయి. వీటి వల్లే గతంలో భూమిపై ఉన్న 70 శాతం జీవరాశులు అంతరించిపోయాయని చరిత్రకారులు చెబుతుంటారు. ఆ సమయంలో డైనోసార్లు సైతం తుడిచిపెట్టుకుపోయాయని అంటుంటారు.....
ఇంటర్నెట్ డెస్క్: విశ్వంలో గ్రహాలతో పాటే అనేక గ్రహశకలాలూ ఉన్నాయి. వీటి వల్లే గతంలో భూమిపై ఉన్న 70 శాతం జీవరాశులు అంతరించిపోయాయని చరిత్రకారులు చెబుతుంటారు. ఆ సమయంలో డైనోసార్లు సైతం తుడిచిపెట్టుకుపోయాయని అంటుంటారు. ఇక 2013 ఫిబ్రవరి 15న రష్యాలోని చెల్యాబిన్క్స్ అనే ప్రాంతంలో ఓ భారీ ఉల్క రాలి పడింది. దీని ధాటికి చుట్టుపక్కల ఆరు నగరాల్లోని 7,200 భవనాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 1500 మంది గాయపడ్డారు. భూమికి దగ్గరగా వెళ్లిన ఓ గ్రహశకలం నుంచే ఈ ఉల్క ఊడిపడిందని తర్వాత జరిపిన పరిశోధనల్లో తేలింది.
ఇలా భూమికి గ్రహశకలాల నుంచి ముప్పు ఎప్పటి నుంచో పొంచి ఉంది. వీటిపై శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశోధనలు జరపుతూనే ఉన్నారు. ఈ క్రమంలో భూమికి దగ్గరగా వస్తున్న గ్రహశకలాలను గుర్తించి వాటి కక్ష్యను బట్టి ముప్పు ఉందో.. లేదో.. ముందే చెబుతున్నారు. అయితే, సమీప భవిష్యత్తుల్లో భూమిని ఢీకొట్టగలిగే అవకాశం ఉన్న గ్రహశకలాలను మాత్రం శాస్త్రవేత్తలు ఇప్పటికైతే గుర్తించలేకపోయారు. కానీ, వీటి నుంచి ముప్పు మాత్రం కొట్టిపారేయలేమని కచ్చితంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అంతరిక్ష పరిశోధనల్లో ఎంతో పురోగతి సాధించిన నేపథ్యంలో నాసా కీలక ప్రయోగానికి సిద్ధమైంది. గ్రహశకలాల వేగాన్ని, దిశను మార్చగలమా అన్న కోణంలో పరిశోధనలకు శ్రీకారం చుట్టింది.
మిషన్ డార్ట్...
ఈ మిషన్కు డార్ట్- ‘డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్’ అని పేరు పెట్టారు. ఈ వాహక నౌకను స్పేస్ ఎక్స్ నిర్మించిన పాల్కన్-9 రాకెట్ భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11:51 గంటలకు అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. దాదాపు ఏడాది పాటు ఇది ప్రయాణం చేసి లక్షిత కక్ష్యను చేరుకోనుంది. భవిష్యత్తులో ఏదైనా గ్రహశకలం వల్ల భూమికి ప్రమాదం పొంచి ఉంటే.. వాటిని అంతరిక్ష వాహకనౌకతో ఢీకొట్టి దాని వేగాన్ని, దిశను మార్చే ప్రయత్నమే ఈ ప్రయోగం. అంటే భూగ్రహ రక్షణ నిమిత్తం నాసా ఓ సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేస్తోందన్నమాట!
లక్ష్యం డైమోర్ఫోస్...
ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు డిడిమోస్ అనే గ్రహశకలం చుట్టూ తిరుగుతున్న డైమోర్ఫోస్ అనే మరో చిన్న గ్రహశకలాన్ని ఎంచుకున్నారు. ఇది ఒక ఫుట్బాల్ పరిమాణంలో ఉంటుంది. వీటిని 20 ఏళ్ల క్రితం కనుగొన్నారు. సెప్టెంబరు 2022లో ఇవి భూమికి అతి సమీపంలో(దాదాపు 1.4 కోట్ల కిలోమీటర్లు)కి రానున్నాయి. సరిగ్గా ఆ సమయంలో డార్ట్ వాహకనౌక డైమోర్ఫోస్ దగ్గరకు చేరుకుంటుంది. దాదాపు గంటకు 24,140 కి.మీ వేగంతో వెళ్లి దాన్ని ఢీకొంటుంది. డార్ట్పై ఉన్న ‘డ్రాకో’ అనే కెమెరా డైమోర్ఫోస్ను గుర్తించడంలో సాయపడుతుంది. అలాగే దాన్ని ఢీకొట్టడానికి 20 సెకన్ల ముందు వరకు భూమికి చిత్రాలు పంపుతుంది. మరోవైపు డార్ట్లోనే సూట్కేసు పరిమాణంలో ఓ చిన్న ఉపగ్రహం ఉంటుంది. దీన్ని ఇటలీకి చెందిన స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి చేసింది. ఇది గ్రహశకలాన్ని ఢీకొట్టడానికి 10 రోజుల ముందు డార్ట్ నుంచి విడిపోతుంది. డైమోర్ఫోస్ దగ్గరకు డార్ట్ చేరుకునే సమయానికి ఇది 34 మైళ్ల దూరంలో ఉంటుంది. ఇది ప్రయోగానికి సంబంధించిన కీలక చిత్రాలు, వీడియోలను తీసి పంపుతుంది. ఢీకొట్టిన తర్వాత డైమోర్ఫోస్తో పాటే ప్రయాణించి మరికొన్ని ఫొటోలు తీస్తుంది. వాస్తవానికి డైమోర్ఫోస్ వల్ల భూమికి ఎలాంటి ముప్పు లేదు. కేవలం ప్రయోగానికి మాత్రమే దీన్ని ఎంచుకున్నారు.
ప్రయోగం విజయవంతమైందని తెలుసుకోవడం ఎలా?
డార్ట్ ఢీకొట్టడం వల్ల డైమోర్ఫోస్ కక్ష్య మారిందా? లేదా? అని తెలుసుకోవడమే ప్రయోగం ముఖ్య ఉద్దేశం. దీనికోసం భూమిపై ఉన్న శక్తిమంతమైన టెలిస్కోపులను వినియోగించనున్నారు. ఇవి డైమోర్ఫోస్ను ఢీకొట్టిన ప్రాంతంతో పాటు డిడిమోస్పై దృష్టి పెడతాయి. టెలిస్కోప్లో ఇవి రెండు చిన్న చుక్కల్లా కనిపిస్తాయి. ముందుగా చెప్పినట్లు డైమోర్ఫోస్, డిడిమోస్ చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో డైమోర్ఫోస్.. డిడిమోస్ను దాటుకుంటూ వెళ్లేటప్పుడు భూమిపై నుంచి చూస్తే చిన్న మినుకుమినుకుమనే వెలుగు వస్తుంది. ఇలా రెండు మినుకుమినుకు మనే వెలుగుల మధ్య సమయాన్ని బట్టి ప్రదక్షిణానికి పడుతున్న సమయాన్ని లెక్కిస్తారు. ప్రస్తుతం 11 గంటల 55 నిమిషాలు తీసుకున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రయోగం తర్వాత కూడా దీన్ని రికార్డు చేస్తారు. ఈ సమయంలో కనీసం 73 సెకన్ల తేడా ఉంటే కక్ష్య మారిందని.. మిషన్ విజయవంతమైనట్లు నిర్దారిస్తారు. అయితే, తాజా ప్రయోగంలో దాదాపు 10 నుంచి 20 నిమిషాల తేడా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సమీప భవిష్యత్తులో ఏదైనా భూమిని ఢీకొడుతుందా?
రాబోయే 100 సంవత్సరాల వరకు భూమికి గ్రహశకలాల వల్ల ఎలాంటి ముప్పు లేదని నాసా తెలిపింది. ఇది ఎప్పటికప్పుడు భూమికి దగ్గరగా వచ్చే వస్తువులపై నిఘా పెట్టి ఉంచుతుంది. భూమికి కనీసం 2.8 కోట్ల మైళ్ల సమీపంలోకి వచ్చే వస్తువుల జాబితాను నాసా సిద్ధం చేస్తుంటుంది. ఇప్పటి వరకు 27,000 ఆబ్జెక్టులను గుర్తించారు. వీటిలో చాలా వరకు భూమిని ఢీకొట్టే అవకాశం లేదు. నాసా సెంట్రీ రిస్క్ టేబుల్ పేరిట మరో జాబితాను కూడా సిద్ధం చేస్తుంటుంది. దీంట్లో భూమిని ఢీకొట్టే ముప్పు ఎక్కువగా ఉన్నవాటిని చేర్చుతారు. వాటిలో బెన్ను అనే గ్రహశకలం ఒకటి. ఇది భూమిని ఢీకొట్టడానికి రూ.0.057 శాతం అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది చిన్నపాటి ఆకాశహార్మ్యం పరిమాణంలో ఉన్నట్లు గుర్తించారు. 2178-2290 సంవత్సరాల మధ్య ఇది భూమికి అత్యంత సమీపంలోకి రానున్నట్లు చెబుతున్నారు. నాసా దీనిపై అధ్యయనానికి ఇప్పటికే ఒసైరిక్స్ అనే వాహకనౌకను పంపింది. ఇటీవలే ఇది బెన్ను నుంచి మట్టి నమూనాలను కూడా సేకరించింది. తిరిగి సెప్టెంబరు 2023లో ఇది భూమికి చేరుకోనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు