Trilochan Singh: నేషనల్ కాన్ఫరెన్స్ కీలక నేత అనుమానాస్పద మృతి!
నేషనల్ కాన్ఫరెన్స్లో కీలక నేతగా ఉన్న త్రిలోచన్ సింగ్ వజీర్ (67) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దిల్లీ మోతీనగర్లోని ఓ అపార్టుమెంటులో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
హత్య కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు
దిల్లీ: నేషనల్ కాన్ఫరెన్స్ కీలకనేతగా త్రిలోచన్ సింగ్ వజీర్ (67) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దిల్లీ మోతీనగర్లోని ఓ అపార్టుమెంటులో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఆయన మృతదేహాన్ని గురువారం ఉదయం పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆయనను ఎవరో హత్య చేసినట్లుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. హర్పీత్సింగ్ ఖల్సా అనే వ్యక్తి ఆ గదిని అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నట్లు భావిస్తోన్న పోలీసులు.. ఆయన కోసం గాలింపు ముమ్మరం చేశారు. త్రిలోచన్ సింగ్ వజీర్ది హత్యగానే భావిస్తున్నప్పటికీ పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి విషయాలు తెలుస్తాయని దిల్లీ పోలీసులు వెల్లడించారు.
జమ్మూ కశ్మీర్ గురుద్వారా బోర్డు చీఫ్గా ఉన్న త్రిలోచన్ సింగ్, ప్రైవేటు ట్రాన్స్పోర్టర్గానూ పేరుంది. త్వరలోనే ఆయన కెనడాకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక నేషనల్ కాంగ్రెస్ అధినేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాకు త్రిలోచన్ సింగ్ అత్యంత సన్నిహితుడిగా చెబుతుంటారు. త్రిలోచన్ సింగ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా.. ఈమధ్యే ఆయనతో జమ్మూలో సమావేశమైనట్లు ట్విటర్లో వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.