Nikki Haley: ‘రూ.6.31లక్షల కోట్ల ఆయుధాలు తాలిబన్ల పరం’..!
అఫ్గాన్ను వశం చేసుకున్న తాలిబన్లకు అమెరికా పూర్తిగా లొంగిపోయిందని ఇండో-అమెరికన్ నేత, ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ పేర్కొన్నారు.
ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ
వాషింగ్టన్: అఫ్గానిస్థాన్ నుంచి తమ బలగాలను విరమించే ప్రక్రియలో అగ్రరాజ్యం అమెరికా సరిగా వ్యవహరించడంలేదని ఇప్పటికే అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా అమెరికన్ నేతల నుంచీ ఇలాంటి విమర్శలు ఎక్కువయ్యాయి. అఫ్గాన్ను వశం చేసుకున్న తాలిబన్లకు అమెరికా పూర్తిగా లొంగిపోయిందని ఇండో-అమెరికన్ నేత, ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ పేర్కొన్నారు. దీంతో మిత్ర దేశాలను కూడా అమెరికా ఒంటరి చేసిందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మిత్ర దేశాల విశ్వాసాన్ని కాపాడుకోవడంతో పాటు అఫ్గాన్లో చిక్కుకున్న వారిని తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని బైడెన్ ప్రభుత్వానికి నిక్కీ హేలీ సూచించారు.
‘సంక్షోభ సమయంలోనూ తాలిబన్లతో చర్చలు జరపడం లేదు. వారు తాలిబన్లకు పూర్తిగా లొంగిపోయారు. నాటో బలగాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న బగ్రాం ఎయిర్ఫోర్స్ బేస్ను కూడా అప్పగించారు. అమెరికాకు చెందిన 85 బిలియన్ డాలర్ల విలులైన ఆయుధాలతో పాటు ఇతర పరికరాలను కూడా వారికే వదిలేశారు’ అని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా రాజకీయ నేత నిక్కీ హేలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమెరికా బలగాల ఉపసంహరణపై అధ్యక్షుడు జో బైడెన్ వ్యవహరించిన తీరుపై నిక్కీ హేలీ తీవ్రంగా మండిపడ్డారు. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో నాలుగేళ్లపాటు అఫ్గానిస్థాన్ సురక్షితంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
అమెరికా పౌరులను తరలించకముందే బలగాల ఉపసంహరణ పూర్తి చేయాలని తాలిబన్లకు వారిని బందీలుగా మిగిల్చారు. కేవలం అమెరికన్లనే కాకుండా మిత్రదేశాల పౌరులను కూడా ఒంటరిగా వదిలివేశారు. అయినా కూడా వారితో సంప్రదింపులు జరపడం లేదు. ఇది పూర్తిగా తాలిబన్లకు లొంగిపోవడమే కాకుండా బైడెన్ వైఫల్యమని ప్రభుత్వంపై నిక్కీ హేలీ విమర్శలు గుప్పించారు. ఇది నమ్మశక్యం కాని పరిణామమేనని.. ఒకరకంగా చూస్తే అమెరికా పౌరులను తాలిబన్లకు తాకట్టు పెట్టడమేనని అభిప్రాయపడ్డారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో మిత్రదేశాల్లో విశ్వాసం పెంపొందించేలా వారితో కలిసి అఫ్గాన్లో చిక్కుకుపోయిన వారిని తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని బైడెన్ ప్రభుత్వానికి నిక్కీ హేలీ సూచించారు.
ఇక అఫ్గానిస్థాన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాబుల్ నుంచి వాయుమార్గంలో భారీగా ప్రజలను తరలించడం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ అని, ప్రాణనష్టం లేకుండా ఇది సాధ్యం కాకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. అయినప్పటికీ, తాలిబన్ ఆక్రమిత అఫ్గాన్ నుంచి అమెరికన్లను, మిత్రదేశాల వారిని తరలిస్తామని అభయమిచ్చారు. అఫ్గానిస్థాన్ నుంచి ఈనెల 31లోగా తన బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్దేశించుకుంది. ఇదిలాఉంటే, అమెరికాలో వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో (2024) రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగే ఔత్సాహికుల్లో నిక్కీ పేరు ప్రధానంగా వినిపిస్తోన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు