Purvanchal Expressway: రహదారిపై యుద్ధ విమానాలు.. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే విశేషాలివే!
పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇండియన్ ఆర్మీకి చెందిన సి-130జె సూపర్ హెర్క్యులస్ విమానంలో దిగి చరిత్ర సృష్టించనున్నారు.
►
దిల్లీ: అత్యవసర సమయాల్లో రహదారులపైనే యుద్ధవిమానాలు దిగేందుకు వీలుగా జాతీయ రహదారులను రూపొందించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఉత్తర్ప్రదేశ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపైనా ఇలాంటి ల్యాండింగ్కు కసరత్తు పూర్తయ్యింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరిశీలన కూడా విజయవంతమైంది. తాజాగా ఈ ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇండియన్ ఆర్మీకి చెందిన సి-130జె సూపర్ హెర్క్యులస్ విమానంలో దిగి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైమానిక విన్యాసాలను తిలకించనున్నారు. ఈ విన్యాసాల్లో ఏఎన్-32 విమానం, ఫైటర్ జెట్లు సుఖోయ్-30 ఎంకేఐ, మిరాజ్-2000, రఫేల్ వంటి యుద్ధవిమానాలు పాల్గొని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై దిగనున్నాయి.
యుద్ధవిమానాలను దించే వీలున్న పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే రహదారి వల్ల ఉత్తర్ప్రదేశ్కు ఆర్థికంగా, సామాజిక పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ప్రధానమంత్రి ట్విటర్లో పేర్కొన్నారు. 340.8 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం అందుబాటులోకి రావడం వల్ల యూపీలోని లఖ్నవూ నుంచి బిహార్లోని బక్సర్ మధ్య ప్రయాణ సమయం దాదాపు మూడు గంటలు తగ్గనుంది. ఈ ఎక్స్ప్రెస్వే విశేషాలేంటో ఓసారి చూద్దాం.
✈ 340.8 కిలోమీటర్ల పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే లఖ్నవూ-సుల్తాన్పూర్ హైవేలోని చాంద్సరాయ్ గ్రామం నుంచి ప్రారంభమవుతుంది. బారాబంకి, అమేథీ, సుల్తాన్పూర్, ఫైజాబాద్, అంబేద్కర్ నగర్, ఆజంఘర్, మవూ ప్రాంతాలను కలుపుతూ చివరకు ఘాజీపూర్ జిల్లాలోని హల్దారియా గ్రామంలో ముగుస్తుంది.
✈ ఈ ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి 2018 జులై నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆజంఘర్లో శంకుస్థాపన చేశారు.
✈ దాదాపు రూ.22,500కోట్ల వ్యయంతో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే నిర్మాణాన్ని చేపట్టారు.
✈ ప్రస్తుతం ఎక్స్ప్రెస్వేలో ఆరు లేన్లు ఉండగా.. భవిష్యత్లో అవసరమైతే దీన్ని 8 లేన్లకు విస్తరించుకునే వీలుంది.
✈ ఈ హైవే మధ్యలో సుల్తాన్పూర్ దగ్గర యుద్ధ విమానాలు దిగేందుకు వీలుగా దాదాపు మూడు కిలోమీటర్ల దూరం రన్వే ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో భారత వాయుసేన విమానాలు ఇక్కడే దిగేందుకు వీలుంది.
✈ ప్రయాగ్రాజ్, వారణాసి వంటి ముఖ్య నగరాలను కలుపుతూ వెళ్లే ఈ హైవే వల్ల కేవలం మూడున్నర గంటల్లోనే లఖ్నవూ నుంచి బక్సర్ చేరుకోవచ్చు.
✈ హైవే దారిలో మొత్తం 18 ఫ్లైఓవర్లు, ఏడు రైల్వే వంతెనలు, మరోఏడు పొడవైన వంతెనలు, 104 చిన్న బ్రిడ్జిలు, 13 చోట్ల ఇంటర్ఛేంజ్ మార్గాలు ఏర్పాటు చేశారు. ఈ హైవేపై మొత్తం రోడ్డుకు ఇరువైపుల ప్రయాణించేందుకు వీలుగా 271 చోట్ల అండర్పాస్లు నిర్మించారు.
✈ ప్రయాణికులు సేదతీరేందుకు వీలుగా ప్రతి వంద కిలోమీటర్లకు ఒకచోట సదుపాయాలు కల్పించనున్నారు.
✈ రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, మోటారు గ్యారేజీలతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కోసం ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి.
ఇదిలాఉంటే, అత్యవసర సమయాల్లో యుద్ధవిమానాలు రహదారులపై దిగడం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రారంభమైంది. తొలుత జర్మనీలో అలాంటి విన్యాసం జరిగింది. ఇక భారత్లోనూ ఈ ఏడాది సెప్టెంబరులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు రాజస్థాన్లో సత్తా-గాంధవ్ రహదారిపై ఏర్పాటు చేసిన అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్ను ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత