Covid R Factor: ఆందోళన కలిగిస్తోన్న ఆర్ ఫ్యాక్టర్..!
దేశవ్యాప్తంగా మెట్రో నగరాలు, పట్టణాల్లో ఆర్-ఫ్యాక్టర్ 1 దాటడం కలవరపెట్టే విషయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మెట్రో నగరాల్లో క్రమంగా పెరుగుతోన్న కరోనా ఉద్ధృతి
దిల్లీ: గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. రోజువారీగా వెలుగు చూస్తోన్న పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి రేటును తెలియజేసే ఆర్-ఫ్యాక్టర్ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ముంబయి, పుణె నగరాలు మినహా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలు, పట్టణాల్లో ఆర్-ఫ్యాక్టర్ 1 దాటడం కలవరపెట్టే విషయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడి చర్యలు ముమ్మరం చేయాలని సూచిస్తున్నారు.
మెట్రో నగరాల్లో వేగంగా..
కొవిడ్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిచెందుతోన్న వేగాన్ని ఆర్-ఫ్యాక్టర్ (రీ ప్రొడక్షన్ రేట్) ద్వారా అంచనా వేయవచ్చు. ఇందులో భాగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ (IMS) జులై చివరి నాటికి వైరస్ వ్యాప్తిని అంచనా వేసింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఆర్ఫ్యాక్టర్ 1 కంటే ఎక్కువగా నమోదు అవుతున్నట్లు గుర్తించింది. దిల్లీలో ప్రస్తుతం 1.03కు చేరగా, చెన్నైలో 1.15, కోల్కతాలో 1, బెంగళూరులో 1కి చేరువైనట్లు ఐఎంస్ నిపుణులు అంచనా వేశారు. ఇతర నగరాలు, పట్టణాల్లోనూ ఇదే తీరు కనిపించడం ఆందోళన కలిగించే విషయమని ఐఎంఎస్ పరిశోధన బృందానికి నేతృత్వం వహిస్తున్న సితభ్ర సిన్హా అభిప్రాయపడ్డారు. అయితే, ఇది మరో వేవ్కు కారణమవుతుందా అనడానికి ప్రస్తుత పరిస్థితులను మరికొన్ని రోజులు గమనించాల్సి ఉందన్నారు.
ఏపీ, తెలంగాణాల్లోనూ..
దేశవ్యాప్తంగా కొవిడ్ ఇన్ఫెక్షన్ రేటు 1 దాటుతున్నట్లు తెలుస్తోంది. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర మినహా ఈశాన్య రాష్ట్రాల్లో ముందునుంచీ ఈ సంఖ్య 1కి దగ్గరగా ఉంది. అంతేకాకుండా కేరళ, కర్ణాటక, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోనూ వైరస్ వ్యాప్తి రేటు 1కి చేరువవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మే 16నాటికి ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ ఆర్ఫ్యాక్టర్ రేటు 1కన్నా తక్కువే ఉండగా.. ప్రస్తుతం 1కి చేరువయ్యింది. మిజోరం (1.18), మణిపూర్ (1.07), మేఘాలయ (1.19), సిక్కిం (1.13)గా ఉన్నట్లు పేర్కొన్నారు. జులై 26 నాటికి అస్సాం, పశ్చిమబెంగాల్లో ఆర్ఫ్యాక్టర్ను 0.9గా అంచనా వేయగా.. హిమాచల్ ప్రదేశ్లో అత్యధికంగా 1.43కు చేరడం ఆందోళన కలిగించే విషయమని నిపుణులు భావిస్తున్నారు. కేరళ, కర్ణాటకలో మే వరకు ఆర్ఫ్యాక్టర్ 1కంటే తక్కువగానే ఉండగా, ప్రస్తుతం 1.07కు చేరుకుంది.
ఇక పాజిటివ్ నిర్ధారణ అయిన ఒకవ్యక్తి నుంచి ఎంతమందికి ఇన్ఫెక్షన్ సోకుతుందనే విషయాన్ని రీ ప్రొడక్షన్ రేట్ ద్వారా అంచనా వేస్తారు. ఇది 1 కంటే తక్కువగా ఉన్నట్లయితే వైరస్ వ్యాప్తి కాస్త అదుపులోనే ఉందని పరిగణిస్తారు. జులై 30నాటికి దేశంలో దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి పెరగడంతో పాటు ఆర్ ఫ్యాక్టర్ రేటు 1 దాటినట్లు యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ ఈమధ్యే అంచనా వేసింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ పెరుగుదల రేటు 1 దాటుతున్నట్లు ఐఎంస్ కూడా పేర్కొంది. ఫిబ్రవరి 14-మే 7మధ్య కాలంలో జాతీయస్థాయిలో ఇది 1కంటే ఎక్కువగా ఉన్న ఇన్ఫెక్షన్ రేటు.. ఆ తర్వాత నుంచి జులై 27వరకు 1కంటే తక్కువగా ఉంది. తాజాగా మరోసారి క్రమంగా పెరుగుతోంది.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం 40వేల పాజిటివ్ కేసులు, 400 మరణాలు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన కొవిడ్ బాధితుల సంఖ్య 4లక్షల 25వేలు దాటింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతరకర వీడియోల వ్యవహారం(Prajwal Revanna sex abuse case) కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతోంది. జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలు ఒకదానిపై ఒకటి తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. -
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి
ఇటీవల జరిగిన పూంఛ్ ఉగ్రదాడి (Poonch attack) లో ఒక సైనికుడు మృతి చెందారు. ఈ ఘటన గురించి ప్రత్యక్షసాక్షి మీడియాతో మాట్లాడారు. -
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
Sam Pitroda: భారత్లో భిన్నత్వంపై కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కన్పిస్తారని ఆయన అన్నారు. -
₹2.5కోట్లు ఇస్తే ఈవీఎం మార్చేస్తా.. రాజకీయ నేతను డిమాండ్ చేసిన ఆర్మీ జవాన్
Maharashtra: డబ్బులిస్తే ఎక్కువ ఓట్ల పడేలా ఈవీఎంను మార్చేస్తానంటూ రాజకీయ నేతను మోసగించేందుకు యత్నించాడో జవాను. చివరకు కటకటాలపాలయ్యాడు. -
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి
Maldives: భారత్-మాల్దీవుల మధ్య దౌత్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటించనున్నారు. -
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్గా పేర్కొన్నారు. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. -
మంచి, చెడు స్పర్శల గురించే కాదు.. చిన్నారులకు వర్చువల్ టచ్పై కూడా అవగాహన అవసరం: దిల్లీ హైకోర్టు
నేటి సమాజంలో పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి మాత్రమే బోధిస్తే సరిపోదని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు ‘వర్చువల్ టచ్’ అనే అంశంపై కూడా అవగాహన కల్పించాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. -
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. -
అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు
అయోధ్య రామమందిరంపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం