Raghul Gandhi: సహాయక చర్యల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొనాలి: రాహుల్‌ ట్వీట్‌

ఏపీలో భారీ వర్షాలు, వరదల సహాయక చర్యల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొనాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచించారు.

Updated : 21 Nov 2021 13:22 IST

దిల్లీ: ఏపీలో భారీ వర్షాలు, వరదల సహాయక చర్యల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొనాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచించారు. ఈ  మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో వరదలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఆత్మీయులను కోల్పోయిన వారికి నా సానుభూతి. బాధితులకు కాంగ్రెస్‌ కార్యకర్తలు అన్ని విధాలుగా సహాయం చేయాలి’’ అని రాహుల్‌ పేర్కొన్నారు.

గత కొద్దిరోజులుగా ఏపీలో కురుస్తున్న వర్షాలకు రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటికే పలు పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు బాధితులకు అండగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు