IN PICS: విమానాశ్రయ సౌకర్యాలతో ‘రాణి కమలాపతి’ రైల్వేస్టేషన్‌

అత్యాధునిక హంగులతో ఆధునికీకరించిన ‘రాణి కమలాపతి’ రైల్వేస్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గతంలో హబిబ్‌గంజ్‌ పేరుతో ఉన్న ఈ రైల్వేస్టేషన్‌ను రాణి కమలాపతిగా మార్చారు.......

Published : 15 Nov 2021 21:29 IST

భోపాల్‌: అత్యాధునిక హంగులతో ఆధునికీకరించిన ‘రాణి కమలాపతి’ రైల్వేస్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గతంలో హబిబ్‌గంజ్‌ పేరుతో ఉన్న ఈ రైల్వేస్టేషన్‌ను రాణి కమలాపతిగా మార్చారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్న ప్రధాని ఈ రైల్వేష్టేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ మంగుభాయ్‌ పటేల్‌, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ సహా పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. గోండు పాలకురాలు రాణి కమలాపతి పేరుతో రైల్వేస్టేషన్‌కు పేరు పెట్టడంతో ఈ స్టేషన్‌  ప్రాముఖ్యత మరింత పెరిగిందన్నారు. భారతీయ రైల్వే భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఉండబోతోందో ఈ రైల్వేస్టేషన్‌ తెలియజేస్తోందని పేర్కొన్నారు. గతంలో విమానాశ్రయంలో మాత్రమే ఉండే సౌకర్యాలు ఇప్పుడు రైల్వేస్టేషన్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

రూ. 450 కోట్లతో ఆధునికీకరణ

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దాదాపు రూ. 450 కోట్లతో ఈ రైల్వేస్టేషన్‌ను ఆధునికీకరించారు. దీనిని గ్రీన్‌ బిల్డింగ్‌గా రూపొందించారు. ఇందులో ఆధునిక, ప్రపంచస్థాయి సౌకర్యాలున్నాయి. దివ్యాంగులకు ఉపయోగపడేలా పలు నిర్మాణాలు చేపట్టారు. సమీకృత బహుళ-మోడల్ రవాణాకు కేంద్రంగా స్టేషన్‌ను పునరుద్ధరించారు. దేశంలో అత్యాధునిక హంగులున్న రైల్వేస్టేషన్లలో ఇది మొదటి స్థానంలో నిలుస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని