Covid: చైనాకు హెచ్చరిక.. సరిహద్దులు తెరిస్తే రోజుకు 6లక్షల కేసులు!
ప్రయాణ ఆంక్షలను తొలగించి.. కొవిడ్ కట్టడికి ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని పాటిస్తే చైనాలో నిత్యం 6.3లక్షల కొవిడ్ కేసులు బయటపడతాయని హెచ్చరించింది.
‘జీరో కొవిడ్’ వ్యూహంపై తాజా అధ్యయనం
బీజింగ్: కొవిడ్ మహమ్మారితో కుదేలైన ప్రపంచ దేశాలు.. ఓవైపు కొవిడ్ను కట్టడి చేస్తూనే వైరస్తో కలిసి జీవించే వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కానీ, కొవిడ్-19కు పుట్టినిల్లు చైనా మాత్రం ‘జీరో కొవిడ్ (కేసుల సంఖ్య సున్నాకు తీసుకురావడం)’ వ్యూహంతోనే ముందుకెళుతోంది. దీంతో ఒక్క పాజిటివ్ కేసు నమోదైనా.. లక్షల సంఖ్యలో కొవిడ్ టెస్టులు, పకడ్బందీ ట్రాకింగ్ చేపడుతోంది. ఇదే సమయంలో విదేశీ ప్రయాణాలపై ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఆంక్షలు సడలిస్తున్నప్పటికీ చైనా మాత్రం సరిహద్దులను మూసివేయాలనే నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో అసలు సరిహద్దులు తెరిస్తే చైనాలో వైరస్ వ్యాప్తి ఏ మేరకు ఉంటుందనే విషయాన్ని అంచనా వేసేందుకు అక్కడి పెకింగ్ యూనివర్సిటీకి చెందిన నలుగురు గణిత శాస్త్రవేత్తల బృందం ఓ అధ్యయనం చేపట్టింది. ప్రయాణ ఆంక్షలను తొలగించి.. కొవిడ్ కట్టడికి ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని పాటిస్తే చైనాలో నిత్యం 6.3లక్షల కొవిడ్ కేసులు బయటపడతాయని హెచ్చరించింది.
వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడే..
అధ్యయనంలో భాగంగా అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, స్పెయిన్, ఫ్రాన్స్లలో గడిచిన ఆగస్టులో ఉన్న కొవిడ్ విజృంభణ సమాచారాన్ని విశ్లేషించారు. ఆయా దేశాలు కొవిడ్ కట్టడికి అనుసరిస్తోన్న వ్యూహాన్ని చైనాలో అమలు చేస్తే ఫలితాలు ఎంటాయనే అంచనాలను రూపొందించారు. ఆగస్టు నెలలో అమెరికాలో నిత్యం లక్షా 50 వేల పాజిటివః కేసులు బయటపడ్డాయని.. అదే వ్యూహాన్ని పాటిస్తే చైనాలో నిత్యం 6.3లక్షల కేసులు వెలుగు చూస్తాయని హెచ్చరించారు. ఒకవేళ బ్రిటన్ వ్యూహాన్ని పాటిస్తే.. రోజుకు 2.75లక్షల కేసులు వెలుగు చూస్తాయని.. అదే ఫ్రాన్స్ విధానాన్ని అమలు చేస్తే నిత్యం 4.54 లక్షల కేసులు చైనాలో బయటపడతాయని హెచ్చరించారు.
పెకింగ్ యూనివర్సిటికీ చెందిన శాస్త్రవేత్తలు రూపొందించిన తాజా అధ్యయనం చైనా సీడీసీలో ప్రచురితమైంది. మరింత సమర్థవంతమైన వ్యాక్సిన్లు, నిర్ధిష్ట చికిత్స లేకుండా సరిహద్దులను తెరవడం, బయటనుంచి రాకపోకలు సాగించేవారికి క్వారంటైన్ నిబంధనలను ఎత్తివేస్తే తీవ్ర ఇబ్బందులేనని స్పష్టం చేసింది. ఒకవేళ అలా చేస్తే వైద్యవ్యవస్థ తట్టుకునే స్థాయిలో చైనా లేదని పేర్కొంది. ఒకవేళ విదేశీ ప్రయాణాలపై ఆంక్షలను సడలిస్తే స్థానికంగా భారీ స్థాయిలో వైరస్ విజృంభణ ఉంటుందని.. ఇది చైనా ఆరోగ్య వ్యవస్థపై భరించలేని భారాన్ని మోపుతుందని నిపుణుల బృందం అంచనా వేసింది.
మరో దారి లేదు..
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ భారీ సంఖ్యలో మ్యుటేషన్లకు గురౌతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే స్వభావమున్న ఈ వేరియంట్తో మహమ్మారి నియంత్రణ, నిర్మూలనకు చేపడుతోన్న కార్యక్రమాలకు తీవ్ర సవాలుగా మారే ప్రమాదం ఉందని చైనాలోని ప్రముఖ శ్వాసకోశ నిపుణులు ఝాంగ్ నాన్షాన్ హెచ్చరించారు. ఇప్పటికే చైనాలో 76.8శాతం మందికి టీకా అందించామని అన్నారు. ఈ ఏడాది చివరినాటికి హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే లక్ష్యంతో 80శాతం మందికి వ్యాక్సిన్ పంపిణీ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. అయితే, వైరస్ రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతుండడం, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మరణాల రేటు 2శాతం ఉన్న నేపథ్యంలో వైరస్ను కట్టడి చేసేందుకు చైనాకు ‘జీరో కొవిడ్’ వ్యూహం తప్పించి మరోదారి లేదన్నారు.
ఇదిలాఉంటే, చైనాలో నిత్యం పదుల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 23కేసులు నమోదు కాగా వాటిలో 20కేసులు విదేశాల నుంచి వచ్చినవారిలోనే వెలుగు చూశాయి. ఇదే సమయంలో విదేశాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా అధికారులు నిర్దేశించిన హోటల్లో 21రోజులు క్వారంటైన్లో ఉండాలని నిబంధన అమలు చేస్తున్నారు. ఇలా చైనాలో ఇప్పటివరకు 98,631 కేసులు మాత్రమే వెలుగు చూసినట్లు అక్కడి నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. వారిలో 4636 మంది మృతి చెందినట్లు పేర్కొంది. ప్రస్తుతం 785 మంది చికిత్స పొందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!