Children Vaccine: చిన్నారులకు కొవిడ్ టీకా.. త్వరలోనే 5 అందుబాటులోకి!
2 ఏళ్లు పైబడిన పిల్లల కోసం త్వరలోనే 5 వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి
దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 50శాతం అర్హులకు పూర్తి మోతాదులో (రెండు డోసుల్లో) టీకా అందించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదే సమయంలో 18ఏళ్లలోపు చిన్నారులకు టీకా అందించేందుకూ ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. 2 ఏళ్లు పైబడిన పిల్లల కోసం త్వరలోనే ఐదు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా చిన్నారుల వ్యాక్సిన్లపై సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ సమాధానం ఇచ్చింది.
దేశంలో చిన్నారుల కోసం ఐదు వ్యాక్సిన్ల ప్రయోగాలకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) అనుమతి ఇచ్చిందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ వెల్లడించారు. క్యాడిలా హెల్త్కేర్కు చెందిన జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్- కొవాగ్జిన్, సీరం ఇన్స్టిట్యూట్-కొవొవాక్స్, బయోలాజికల్ ఇ- ఆర్బీడీ, జాన్సన్ & జాన్సన్కు చెందిన Ad26COV2S వ్యాక్సిన్లు అనుమతి పొందిన వాటిలో ఉన్నాయని చెప్పారు. వీటిలో ఇప్పటికే కొన్ని ప్రయోగాలు పూర్తి చేసుకోగా.. మరికొన్ని తుదిదశకు చేరుకున్నాయని అన్నారు. నిపుణుల కమిటీ సమీక్ష అనంతరం ఇవి అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
జైకోవ్-డీ (ZyCoV-D): 12 ఏళ్ల వయసుపైబడిన పిల్లలపై జైకోవ్-డీ (డీఎన్ఏ ఆధారిత) టీకా ప్రయోగాలు పూర్తయ్యాయి. అత్యవసర వినియోగానికి ఇప్పటికే క్యాడిలా హెల్త్కేర్ అనుమతి పొందింది. ఇప్పటికే కోటి డోసులకు కేంద్రం ఆర్డరు చేసింది. తొలుత ఈ వ్యాక్సిన్ను మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, ఝార్ఖండ్, బిహార్తోపాటు పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పంపిణీ చేయనున్నారు.
కొవాగ్జిన్ (Covaxin): 2 నుంచి 18ఏళ్ల పిల్లలకోసం కొవాగ్జిన్ టీకా రెండు/మూడోదశ ప్రయోగాలను భారత్ బయోటెక్ చేపట్టింది. వ్యాక్సిన్ భద్రత, రోగనిరోధకత సామర్థ్యానికి సంబంధించిన మధ్యంతర ఫలితాల సమాచారాన్ని ఇప్పటికే నియంత్రణ సంస్థలకు అందించింది.
కొవొవాక్స్ (COVOVAX): 2 నుంచి 17ఏళ్ల వయసు వారికోసం రూపొందించిన కొవొవాక్స్ తుది దశ ప్రయోగాలను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేపట్టింది. వీటిని దాదాపు 920 మంది వాలంటీర్లపై ప్రయోగిస్తున్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా భారీస్థాయిలో చేపడుతున్నారు.
బయోలాజికల్ ఇ (RBD): 5 నుంచి 18ఏళ్ల మధ్యవయసు వారికోసం రూపొందించిన ఆర్బీడీ టీకాపై బయోలాజికల్-ఇ ప్రయోగాలు నిర్వహిస్తోంది. దాదాపు 624 మంది వాలంటీర్లపై తుదిదశ ప్రయోగాలు జరుగుతున్నాయి.
జాన్సన్ & జాన్సన్ (Ad26COV2S): 12 నుంచి 17ఏళ్ల వయసు పిల్లలకోసం జే&జే రూపొందించిన ‘Ad26COV2S’ టీకా రెండు/మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఇలా చిన్నారుల కోసం రూపొందించిన ఐదు వ్యాక్సిన్లు వివిధ దశలో ఉన్నాయిని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి వివరించారు.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 125 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందజేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వాటిలో 79.13కోట్ల (84శాతం) మంది అర్హులకు తొలిడోసు అందించగా.. 45.8కోట్ల (49శాతం) మందికి పూర్తి మోతాదులో వ్యాక్సిన్ అందించామని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.