Omicron Variant: బ్రిటన్‌లో ఒమిక్రాన్‌ కలకలం.. ఇద్దరికి పాజిటివ్‌

బ్రిటన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్​ వేరియంట్‌ను గుర్తించినట్లు అక్కడి అధికారులు స్పష్టం చేశారు. కొత్త వేరియంట్​ సోకిన రోగులు చెమ్స్‌ఫోర్డ్, నాటింగ్‌హామ్‌లకు చెందిన వారని వెల్లడించారు.....

Published : 28 Nov 2021 01:24 IST

లండన్‌: దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్తరకం కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌.. ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో పాటు బోట్స్‌వానా, బెల్జియం, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌ దేశాల్లో ఈ కేసులు బయటపడగా.. తాజాగా ఆ జాబితాలో బ్రిటన్​ చేరింది. ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్​ వేరియంట్‌ను గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్​ సోకిన రోగులు చెమ్స్‌ఫోర్డ్, నాటింగ్‌హామ్‌లకు చెందిన వారని వెల్లడించారు. వీరికి దక్షిణాఫ్రికా ప్రయాణికులతో సంబంధం ఉన్నట్లు స్పష్టం చేశారు.

కొత్తగా గుర్తించిన కేసులకు సంబంధించి ఆ ఇద్దరికీ మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతున్న సమయంలో ఆ ఇద్దరు వ్యక్తులు హోం ఐసోలేషన్​లో ఉన్నారని పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యగా.. కొత్త కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో మరిన్ని పరీక్షలు నిర్వహిస్తామని ఆ దేశ హెల్త్​ సెక్రెటరీ సాజీద్​ జావెద్​ తెలిపారు. ఈ వేరియంట్​ వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాత్మక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తదుపరి నిర్ణయాలు తీసుకునేందుకు అధికారులతో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని