UN: లక్షమంది నిరాశ్రయులైపోతారు.. కూల్చొద్దు!
హరియాణాలోని ఖోరి గ్రామంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ భారత అధికారులకు విజ్ఞప్తి చేసింది.
ఖోరి గ్రామంపై భారత అధికారులకు ఐరాస విజ్ఞప్తి
ఛండీగఢ్: హరియాణాలోని ఖోరి గ్రామంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ భారత అధికారులకు విజ్ఞప్తి చేసింది. ఖోరి గ్రామంలో నిర్మాణాలను కూల్చివేసే నిర్ణయాన్ని వెంటనే పునః సమీక్షించుకోవడంతో పాటు, వారి పునరావాసంపై మరోసారి పరిశీలించాలని కోరింది. సకాలంలో వారికి పరిహారం అందించడంతో పాటు పరిష్కారం లభించే వరకు ఎవ్వరినీ బలవంతంగా ఖాళీ చేయించకూడదని పేర్కొంది. తద్వారా లక్ష మంది ప్రజలు నివాసం లేనివారు కాకుండా జాగ్రత్తపడవచ్చని అభిప్రాయపడింది. ముఖ్యంగా వారిలో దాదాపు 20వేల మంది చిన్నారులు కూడా ఉన్నారని.. తాజా చర్యలతో వారంతా నిరాశ్రయులు అవుతారని ఐరాస విభాగం ఆందోళన వ్యకం చేసింది.
భారత్ అసంతృప్తి.. వెనక్కి తగ్గిన యూఎన్
ఓవైపు కరోనా మహమ్మారి, మరోవైపు వర్షాకాల సమయంలో కూల్చివేతలు చేపట్టడంపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషన్ (OHCHR) ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై భారత్ స్పందించేలోపే వీటిని వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఐరాస మానవ హక్కుల విభాగం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరిణామంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశంపై తాము సమాధానం ఇచ్చేలోపే మీడియా ప్రకటన విడుదల చేయడం దురదృష్టకరమని పేర్కొంది. అయితే, ఐరాస మానవ హక్కుల విభాగం తొందరపాటు చర్య దురదృష్టకరమని భారత్లోని ఐరాస శాశ్వత కమిషన్ స్పష్టం చేసింది. భారత సుప్రీంకోర్టుపై ప్రత్యేక ప్రతినిధి చేసిన అగౌరవ వ్యాఖ్యలపైనా ఆందోళన వ్యక్తంచేసిన యూఎన్, ఇలాంటి చర్యలు సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అభిప్రాయపడింది. దేశ ప్రజల మానవ హక్కుల బాధ్యతల గురించి భారత్కు పూర్తిగా తెలుసని.. వాటి అమలుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టిందని మరో ప్రకటనలో వెల్లడించింది.
హరియాణాలోని ఖోరి గ్రామంలో అటవీ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఫరీదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను జూన్ 7న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ నిర్మాణాలు అటవీ భూమిలో చేపట్టినందున ఎటువంటి మినహాయింపూ ఇచ్చేదిలేదని స్పష్టం చేసింది. వాటి తొలగింపునకు ఆరువారాల గడువు ఇచ్చిన కోర్టు.. ఈ ప్రక్రియను జులై 19 నాటికి పూర్తిచేయాలని పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నిర్మాణాలను తొలగించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఆ గ్రామంలో 172 ఎకరాల అటవీ భూమిలో దాదాపు 5300 అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు అధికారులు గుర్తించారు. వాటిలో ఇప్పటికే 2 వేల ఇళ్లను నేలమట్టం చేసినట్లు సమాచారం. గడిచిన మూడు రోజుల్లోనే 800 ఇళ్లను అధికారులు కూల్చివేశారు. అయితే, చట్టప్రకారం వారందరికీ పునరావాసం కల్పిస్తున్నామని ఫరీదాబాద్ మున్సిపల్ అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
బెంగళూరు కేఫ్లో బాంబు పేలుడు నిందితుల ఆచూకీ చెప్పిన వారికి ఎన్ఐఏ రూ.20 లక్షల రివార్డు ప్రకటించింది. -
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
Anand Mahindra - Elon Musk: తయారీ రంగంలో హీరోల జీవితాలను వెండి తెరపైకి తీసుకురావాలని ఎలాన్ మస్క్ ఇచ్చిన పిలుపును ఆనంద్ మహీంద్రా స్వాగతించారు. -
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ (C-Vigil) యాప్ ద్వారా 79 వేల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎంపీల్లో 44శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. 5శాతం మంది ఎంపీలు కోటీశ్వరులని, వారి ఒక్కొక్కరి సంపద రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపింది. -
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
Fake Calls: టెలికాం శాఖ పేరుతో మీకు కాల్స్ వస్తున్నాయా?ఫోన్ నంబరు డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. -
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్