Omicron: ఒమిక్రాన్పై టీకాలు పనిచేస్తాయా? బయోఎన్టెక్ సీఈఓ ఏమన్నారంటే..
కొత్త వేరియంట్ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ల సామర్థ్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ అంతర్జాతీయ ఔషధ తయారీ సంస్థ బయోఎన్టెక్ సీఈఓ ఉగుర్ సాహిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. దీనిపై ఇంకా సమగ్ర సమాచారం లేకపోవడంతో అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వేరియంట్ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ల సామర్థ్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ అంతర్జాతీయ ఔషధ తయారీ సంస్థ బయోఎన్టెక్ సీఈఓ ఉగుర్ సాహిన్ కొంత ఊరటనిచ్చే వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు.. ఒమిక్రాన్ సోకిన వారిని తీవ్రమైన వ్యాధి లక్షణాల నుంచి కాపాడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎక్కువ మొత్తంలో ఉత్పరివర్తనాలు చోటుచేసుకున్న కొత్త వేరియంట్ వల్ల టీకా వేసుకున్న వారిలోనూ ఎక్కువ కేసులు బయటపడొచ్చని సాహిన్ తెలిపారు. వ్యాక్సిన్ వల్ల ఏర్పడే ప్రతిరోధకాల నుంచి ఈ వేరియంట్ తప్పించుకోగలిగే అవకాశం కూడా ఉండొచ్చన్నారు. అయినప్పటికీ టీకా వల్ల వచ్చిన రోగనిరోధకత దాన్ని అడ్డుకోగలుగుతుందని వివరించారు. అయితే, నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. బూస్టర్ డోసును వేగవంతం చేయాలని సూచించారు. ఫైజర్తో కలిసి బయోఎన్టెక్ కరోనా టీకాను తయారు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో ప్రధానంగా పంపిణీ చేస్తున్న టీకాల్లో ఇదొకటి.
భిన్న వాదనలు..
ఒమిక్రాన్పై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో సాహిన్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం కొంత ఊరట కలిగించే విషయమనే చెప్పాలి. మరో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ మోడెర్నా సీఈఓ స్టీఫన్ బ్యాన్సెల్ మంగళవారం మాట్లాడుతూ.. ఒమిక్రాన్ కోసం కొత్త టీకాను అభివృద్ధి చేయాల్సి రావొచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో నిన్న ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఇక ఆస్ట్రాజెనెకాతో కలిసి కొవిడ్ టీకా అభివృద్ధి చేసిన ఆక్స్ఫర్డ్ వర్గాలు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న టీకాలు ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పించలేవని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని వ్యాఖ్యానించాయి.
మరో రెండు వారాలు గడిస్తే ఒమిక్రాన్పై పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి వరకు వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని చెప్పలేమంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. కొత్త వేరియంట్పై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అయితే, ప్రస్తుతం ఉన్న టీకాలు దీని నుంచి కొంత వరకైనా రక్షణ కల్పిస్తాయని తమ వైద్య బృందం భావిస్తున్నట్లు తెలిపారు. దీనిపై సమగ్ర సమాచారం మరికొన్ని వారాల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. ఒమిక్రాన్ కోసం ప్రత్యేకంగా వ్యాక్సిన్లు తయారు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు కొత్త టీకాల అవసరం ఏర్పడితే.. వాటి అత్యవసర వినియోగ అనుమతికి కావాల్సిన ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు ఐరోపా సమాఖ్య ఔషధ నియంత్రణ సంస్థ మంగళవారం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. -
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు