Long Covid: ‘లాంగ్ కొవిడ్’ ఆందోళనకరమే..!
చాలా మంది దీర్ఘ కొవిడ్ (Long Covid) సమస్యలతో బాధపడడం ఆందోళన కలిగించే విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
జెనీవా: ఏడాదిన్నర కాలంగా ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి.. ఇప్పటికే 20కోట్ల మందిలో వెలుగు చూసింది. ఇక గుర్తించని వారి సంఖ్య మరింత ఎక్కువగానే ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది దీర్ఘ కొవిడ్ (Long Covid) సమస్యలతో బాధపడడం ఆందోళన కలిగించే విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్ మహమ్మారికి సంబంధించిన మిస్టరీ అంశాల్లో ‘లాంగ్ కొవిడ్’ ఒకటిగా మిగిలిపోయిందని అభిప్రాయపడింది. అందుచేత వైరస్ బారినపడి కోలుకున్న తర్వాత కూడా ఏమైనా దుష్ప్రభావాలు ఎదురైతే వైద్యుల సహాయం తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.
‘పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ (Post Covid Syndrome) లేదా లాంగ్ కొవిడ్’ అనేది వాస్తవం. దీనిని మేము కూడా నిర్ధారించుకున్నాం. కానీ, ఇవి ఎంతకాలం ఉంటాయనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేం. వీటిపై అధ్యయనం చేసి పూర్తిగా నిర్వచించే పనిలో నిమగ్నమయ్యాం’ అని కొవిడ్-19పై WHO టెక్నికల్ విభాగాధిపతి మరియా వాన్ కేర్ఖోవ్ పేర్కొన్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత చాలామంది సుదీర్ఘ కాలం పాటు వాటి దుష్ర్పభావాలను (Side Effects) ఎదుర్కొంటున్నట్లు గుర్తించామన్నారు. అంతేకాకుండా దీర్ఘ కాలం కొవిడ్ ప్రభావాలతో బాధపడుతున్న వారికి మెరుగైన పునరావాస కార్యక్రమాలు కల్పించడంతో పాటు పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ (Syndrome) గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషి చేస్తోందని మరియా వాన్ స్పష్టం చేశారు. అయినప్పటికీ వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కనిపించే లక్షణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు.
200లకుపైగా లక్షణాలు..
కొవిడ్-19 ఇన్ఫెక్షన్ తగ్గినప్పటికీ అనేక మంది బాధితుల్లో దీర్ఘకాలం పాటు కొన్ని రుగ్మతలు కనిపిస్తున్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. వాటి సంఖ్య 200లకుపైగానే ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది వాస్తవమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లినికల్ కేర్ విభాగాధిపతి జానెత్ దియాజ్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఛాతి నొప్పి, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని అన్నారు. కొందరిలో ఇవి కోలుకున్న తర్వాత మూడు నెలలు కనిపించగా.. మరికొందరిలో 6నెలల వరకూ ఉన్నాయని వెల్లడించారు. అంతేకాకుండా మరికొందరి బాధితుల్లో ఇవి తొమ్మిది నెలలకుపైగా ఉండడం ఆందోళన కలిగించే విషయమని జానెత్ దియాజ్ పేర్కొన్నారు. ఇలా సుదీర్ఘ కాలం (Long Covid) లక్షణాలు కనిపించడానికి నరాల సమస్యలు, ఇన్ఫెక్షన్పై రోగనిరోధకత ప్రతిస్పందనతో పాటు పలు అవయవాల్లో వైరస్ అలాగే ఉండిపోవడం వంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయని అన్నారు. వీటిపై మరింత స్పష్టత వచ్చేందుకు 2019లో చైనాలో తొలిసారి వైరస్ బారినపడి కోలుకున్న బాధితులపైనా అధ్యయనం జరిగితే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్