Europe: కరోనా విలయం.. ఇలాగైతే మరో 3నెలల్లో 5 లక్షల మరణాలు!
గతేడాది మాదిరిగానే మహమ్మారి విజృంభణకు యూరప్ కేంద్రబిందువుగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
లండన్: యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ రాకతో వైరస్ విజృంభణ కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపించినప్పటికీ పలు దేశాల్లో మళ్లీ కోరలు చాచుతోంది. ఈ నేపథ్యంలో గతేడాది మాదిరిగానే మహమ్మారి విజృంభణకు యూరప్ కేంద్ర బిందువుగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. గడిచిన కొన్ని వారాల్లో అక్కడ పెరుగుతున్న కొవిడ్ కేసులు, ఆస్పత్రుల్లో చేరికలు ఇలాగే కొనసాగితే వచ్చే ఫిబ్రవరి నాటికి మరో 5లక్షల కొవిడ్ మరణాలు సంభవించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ పలు దేశాల్లో కొవిడ్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా యూరప్ దేశాల్లో కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. కేవలం గడిచిన వారంలోనే యూరప్ వ్యాప్తంగా కొత్తగా 18లక్షల కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల్లో 6శాతం పెరుగుదల కనిపించింది. వీటితో పాటు గతవారంలో మరణాల సంఖ్య 24వేలకు చేరుకుంది. అక్కడి కొవిడ్ మరణాల్లో ఏకంగా 12శాతం పెరుగుదల కనిపించింది. ప్రతి లక్ష మందికి 192 కేసులు బయటపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా గతవారం నమోదైన మొత్తం కేసుల్లో 59శాతం ఉండగా, సగం మరణాలు ఇక్కడే చోటుచేసుకున్నాయి.
ఫిబ్రవరి నాటికి 5లక్షల మరణాలు..
గత ఐదు వారాలుగా అక్కడ పెరుగుతోన్న కొవిడ్ తీవ్రత.. మరికొన్ని రోజులపాటు ఇలాగే కొనసాగితే వచ్చే ఫిబ్రవరి నాటికి యూరప్లో 5లక్షల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ డైరెక్టర్ డాక్టర్ హాన్స్ క్లూగే హెచ్చరించారు. వ్యాక్సినేషన్ కొనసాగుతున్నప్పటికీ కొవిడ్ తీవ్రత క్రమంగా పెరగడం ఆందోళన కలిగించే విషయమని అభిప్రాయపడ్డారు. అయితే, కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారిలో అధికంగా పూర్తి మోతాదులో వ్యాక్సిన్ తీసుకోనివారే ఉన్నట్లు వెల్లడించారు. ఇలా వైరస్ తీవ్రత పెరుగుతుండటం చూస్తుంటే మరో వేవ్ ముంచుకొస్తుందనే విషయం స్పష్టమవుతోందని స్వీడన్ చీఫ్ ఎపిడమాలజిస్ట్ ఆండర్స్ టెగ్నెల్ స్పష్టం చేశారు. ముఖ్యంగా శీతాకాలంలో వైరస్ విజృంభణ పెరగడం ఈ ఆందోళన పెరగడానికి కారణమని అన్నారు.
మందగించిన వ్యాక్సినేషన్..
యూరప్ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగినప్పటికీ పలు దేశాల్లో పూర్తి స్థాయిలో టీకాను అందించలేకపోతున్నాయి. యూరప్లో సరాసరిగా 47శాతం పూర్తిస్థాయిలో పంపిణీ చేశారు. కేవలం 8 దేశాలు మాత్రమే 70శాతం మందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందించాయి. ఇదే సమయంలో సరైన వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నప్పటికీ మిగతావారు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదనే వాదన ఉంది. మరో ముప్పు పొంచివున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని ఆమ్స్టర్డామ్లోని యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇక ఈ ప్రాంతంలో కొవిడ్ వ్యాక్సిన్ సమృద్ధిగా అందుబాటులో ఉన్నప్పటికీ.. అవి అన్ని ప్రాంతాలకు సమానంగా చేరడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ విభాగాధిపతి డాక్టర్ మైక్ రేయాన్ అభిప్రాయపడ్డారు. ఈ అగాధాన్ని వెంటనే సరిచేయడంతో పాటు కొవిడ్ కట్టడి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని యూరప్ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.