UN Warning: అగాధం అంచుల్లో ప్రపంచం.. మేల్కొనాల్సిందే!
యావత్ ప్రపంచం అగాధం అంచులో ఉందని.. ఇలాంటి సంక్షోభ సమయంలో మేల్కొనాల్సిందేనని ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సర్వసభ్య సమావేశాల ప్రారంభోపన్యాసం సందర్భంగా ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు.
ప్రపంచ దేశాలకు ఐరాస చీఫ్ హెచ్చరిక
వాషింగ్టన్: ఇదివరకు ఎన్నడూ చవిచూడని విధంగా యావత్ ప్రపంచం విపరీత సంక్షోభాలను ఎదుర్కొంటోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ముఖ్యంగా కొవిడ్ మహమ్మారి విజృంభణ, ముంచుకొస్తున్న వాతావరణ సంక్షోభం, అఫ్గానిస్థాన్ నుంచి ఇథియోపియా వరకు ఉద్రిక్త పరిస్థితులతోపాటు ఇతర దేశాల్లో శాంతికి విఘాతం కలిగిస్తున్న తిరుగుబాటు వంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. ఈ తరహా ఉపద్రవాన్ని లేదా విభజనను ప్రపంచం ఇంతకుముందెన్నడూ చూడలేదని అభిప్రాయపడింది. ఇలాంటి సంక్షోభ సమయంలో యావత్ ప్రపంచం మేల్కొనాల్సిందేనని ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సర్వసభ్య సమావేశాల ప్రారంభోపన్యాసం సందర్భంగా ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు.
‘నేను ఇక్కడ నుంచి ఓ హెచ్చరిక చేస్తున్నాను. యావత్ ప్రపంచం మేల్కొనాలి. ప్రస్తుతం మనం అగాధం అంచులో ఉన్నాం. అంతేకాకుండా తప్పు మార్గంలో ముందుకెళ్తున్నాం. ప్రపంచం ఇంతకుముందు ఎన్నడూ ఇంతటి ప్రమాదంలో పడలేదు. లేదా ఇంతగా విభజించబడ లేదు. మన జీవితకాలంలోనే అత్యంత ప్రమాదకరమైన సంక్షోభాలను ఎదుర్కొంటున్నాం’ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ప్రపంచానికి అత్యంత అవసరం ఏర్పడిన సమయంలోనూ వివిధ దేశాల సంఘీభావం, కార్యాచరణ ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
‘మానవ హక్కులు మంటల్లో కలిసిపోతున్నాయ్. సైన్స్పై దాడి జరుగుతోంది. ప్రమాదపు అంచుల్లో ఉన్నవారి ఆర్థిక జీవనం మరింత క్షీణిస్తోంది. అఫ్గానిస్థాన్ నుంచి ఇథియోపియా, అక్కడనుంచి యెమెన్ మరకు శాంతికి విఘాతం కలిగించే ఎన్నో సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటికితోడు అపనమ్మకం, అసత్య సమాచారం ప్రజల్లో మరింత విభజనకు కారణమవుతున్నాయి’ అని ఐరాస చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 46లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కరోనా వైరస్ మహమ్మారిపై పోరులోనూ ఇదే ధోరణి కనిపిస్తోందన్నారు. వ్యాక్సిన్ లభ్యతలో దేశాల మధ్య స్పష్టమైన అసమానతలను కొవిడ్ బహిర్గతం చేసిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 570 కోట్ల డోసులను పంపిణీ చేసినప్పటికీ ఆఫ్రికాలో కేవలం 2శాతం మందికే వ్యాక్సిన్ అందిన విషయాన్ని గుర్తుచేశారు. దాదాపు 90శాతం మంది ఆఫ్రికన్లు తొలి డోసు కోసమే నిరీక్షిస్తున్న విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలని ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, కొవిడ్ కారణంగా ఐక్యరాజ్యసమితి వార్షిక సర్వసభ్య సమావేశాలు గతేడాది వర్చువల్గానే జరిగినప్పటికీ ఈ ఏడాది మాత్రం నేరుగా జరుగుతున్నాయి. 193 దేశాలు ప్రాతినిధ్యం ఉన్న ఈ సమావేశాల్లో ఈసారి 100కుపైగా దేశాల ప్రతినిధులు వ్యక్తిగతంగా పాల్గొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.