Afghanistan: ఉగ్రవాద సంస్థలకు మరోసారి వేదిక కానీయొద్దు.. ఐరాస చీఫ్ పిలుపు
యావత్ ప్రపంచానికి పెనుముప్పుగా ఉన్న ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రపంచదేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్యసమితి చీఫ్ పిలుపునిచ్చారు.
వాషింగ్టన్: అఫ్గాన్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఆయా దేశాలు తమ సానుభూతి వ్యక్తం చేస్తూనే.. అఫ్గాన్కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇదే సమయంలో యావత్ ప్రపంచానికి పెనుముప్పుగా ఉన్న ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రపంచదేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియా గుటెరస్ పిలుపునిచ్చారు. వాటికి వేదికగా అఫ్గాన్ మారకుండా ప్రపంచ దేశాలు ఒకేతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు.
‘‘ఉగ్రవాద సంస్థలు అఫ్గానిస్థాన్ను వేదికగా లేదా సురక్షిత ప్రాంతంగా చేసుకునే అవకాశం మరోసారి కల్పించకూడదు. ఇందుకోసం అంతర్జాతీయ సమాజం ఏకం కావాల్సిన అవసరం ఉంది’’ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులతో వేల మంది దేశం విడిచిపోతున్నారన్న వార్తలు కలవరపెడుతున్నాయని అన్నారు. కొన్ని దశాబ్దాలుగా అక్కడి మహిళలు, బాలికలు పొందిన హక్కులు చేజార్చిపోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అఫ్గాన్ పౌరుల మానవ హక్కులను కాపాడడంతో పాటు అక్కడ సురక్షిత వాతావరణం నెలకొనేలా తాలిబన్లతోపాటు ఇతర వర్గాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా