B.1.1.529 Variant: కొత్త వేరియంట్తో ప్రపంచ దేశాల్లో కలవరం!
విస్తృత వ్యాప్తిలో ఉన్న వేరియంట్లతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్ (B.1.1.529) అసాధారణ రీతిలో మ్యుటేషన్లకు గురవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తోన్న నేపథ్యంలో ఆయా దేశాలను కొవిడ్ భయాలు మరోసారి వెంటాడుతున్నాయి.
లండన్: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి తగ్గుతోందని భావిస్తున్న సమయంలోనే దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మరోసారి వైరస్ విజృంభణతో సతమతమవుతున్న యూరప్ దేశాలతో పాటు వైరస్ను సమర్థంగా కట్టడి చేస్తున్న దేశాలు కూడా కలవరపడుతున్నాయి. మరోవైపు కొత్తవేరియంట్ భయంతో ఆసియా, యూరప్, అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా ఒడుదొడుకులకు గురికావడం స్పష్టంగా కనిపించింది. ఇప్పటికే విస్తృత వ్యాప్తిలో ఉన్న వేరియంట్లతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్ (B.1.1.529) అసాధారణ రీతిలో మ్యుటేషన్లకు గురవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఆయా దేశాలను కొవిడ్ భయాలు మరోసారి వెంటాడుతున్నాయి.
కలవరపడుతోన్న దేశాలు..: కొవిడ్ విలయంతో మరోసారి అల్లాడిపోతున్న యూరప్ దేశాలు.. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్తో తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే విస్తృతంగా వ్యాప్తిస్తున్న కొవిడ్ మహమ్మారిని కట్టడి చేయలేకపోతున్న ఈయూ దేశాలకు కొత్త వేరియంట్ మరింత సమస్యగా మారనుందని జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి జెన్స్ స్పాన్ పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ కంటే విస్తృత వ్యాప్తి కలిగి ఉండడంతో పాటు దీనిపై ప్రస్తుతమున్న వ్యాక్సిన్లు తక్కువ సమర్థత కలిగివున్నట్లు తెలుస్తోందని బ్రిటిష్ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ వాజిద్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే సాధ్యమైనంత తొందరగా దీనిపై చర్యలకు ఉపక్రమించాలని అక్కడి చట్టసభ సభ్యులకు సూచించారు. ఇప్పటికే ఈ వేరియంట్కు సంబంధించి దక్షిణాఫ్రికాలో 22 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇజ్రాయెల్లోనూ తొలి కేసు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. వ్యాక్సినేషన్లో ప్రపంచంలోనే ముందున్న ఇజ్రాయెల్ తాజాగా కొత్త వేరియంట్తోనూ కలవరపడుతోంది. మాలావి నుంచి ఒక వ్యక్తిలో ఈ వేరియంట్ వెలుగు చూడగా అనుమానిత లక్షణాలున్న మరో ఇద్దరిని ఐసోలేషన్లో ఉంచి పరీక్షిస్తోంది.
ప్రయాణ ఆంక్షలకు సిద్ధం: కొత్త వేరియంట్తో అప్రమత్తమవుతున్న దేశాలు, ముందుజాగ్రత్తగా ప్రయాణ ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి. దక్షిణాఫ్రికాతోపాటు మరో ఐదు దేశాలనుంచి వచ్చే విమానాలను నిషేధిస్తున్నట్లు బ్రిటన్ ఇప్పటికే ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని పేర్కొంది. ఇదే దారిలో పయణించేందుకు జర్మనీ కూడా సిద్ధమైంది. దక్షిణాఫ్రికా నుంచి కేవలం తమ పౌరులను మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. ఇటలీ కూడా ఆఫ్రికాలోని ఏడు దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించింది. నెదర్లాండ్ కూడా ఇలాంటి ఆంక్షలను అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇక దక్షిణాఫ్రికాతో పాటు పలు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు పదిరోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని జపాన్ ఆదేశించింది. వీరికి మూడు, ఆరు, పదో రోజు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా కూడా ప్రయాణికులకు మళ్లీ కఠిన క్వారెంటైన్ నిబంధనలు అమలు చేసే పనిలో పడింది. ఇటు భారత్ కూడా కొత్త వేరియంట్పై రాష్ట్రాలను హెచ్చరించింది.
స్టాక్ మార్కెట్లు కుదేలు: కేవలం ఆయా దేశాలనే కాకుండా యూరప్, ఆసియాతో పాటు అమెరికా స్టాక్ మార్కెట్లను కూడా కొత్త వేరియంట్ వెంటాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ భయాలతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మరోవైపు ఈ వేరియంట్ ధాటికి ఎయిర్లైన్స్ షేర్లు కుదేలయ్యాయి. లుఫ్తాన్సా 12.4శాతం, బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన ఐఏజీ, ఐబీరియా షేర్లు 14.4 శాతం పడిపోయాయి. వీటితోపాటు ఎయిర్ ఫ్రాన్స్-కేఎల్ఎం షేర్లు 8.9శాతం తగ్గిపోగా ఈజీజెట్ షేర్లు 10.9 శాతం తగ్గిపోయాయి. భారత్లోనూ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో పయనించాయి. శుక్రవారం ఒక్కరోజే దాదాపు రూ.5 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైంది.
తొందరపడొద్దు: WHO: అయితే, కొత్త వేరియంట్తో ప్రపంచ దేశాలు కలవరపడుతున్న నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నేడు భేటీ అయ్యింది. ముఖ్యంగా ఆఫ్రికాలోని పలు దేశాలనుంచి ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నట్లు ఈయూ పేర్కొనడంపై స్పందించిన డబ్ల్యూహెచ్ఓ ఇప్పుడే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది. గతంలోనూ కొత్త వేరియంట్లు వెలుగు చూసిన వెంటనే అత్యవసరంగా సరిహద్దులు మూసివేసి, ప్రయాణాలపై ఆంక్షలు విధించామని గుర్తుచేసింది. ఇలా తొందరపడి నిర్ధారణకు వచ్చి నిర్ణయాలు తీసుకోకుండా.. పరిస్థితులపై మాత్రం ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగాధిపతి మైక్ రేయాన్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు