Covid: కరోనా విలయం.. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల కేసులు..!
కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య తాజాగా 25 కోట్ల మార్కును దాటింది.
పలు దేశాల్లో మళ్లీ విజృంభిస్తోన్న మహమ్మారి
న్యూయార్క్: కరోనా మహమ్మారి వెలుగు చూసి రెండేళ్లు సమీపిస్తున్నప్పటికీ పలు దేశాల్లో వైరస్ ఉద్ధృతి మాత్రం అదుపులోకి రాలేదు. కొవిడ్ను ఎదుర్కొనే వ్యాక్సిన్ను విస్తృతంగా పంపిణీ చేస్తున్నా.. మహమ్మారి నియంత్రణలోకి రావడం లేదు. ముఖ్యంగా డెల్టా వేరియంట్ ప్రభావంతో పలు దేశాల్లో మరోసారి విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య తాజాగా 25 కోట్ల మార్కును దాటింది. అత్యధికంగా అమెరికాలో ఇప్పటివరకు 4.6కోట్ల కేసులు నమోదుకాగా, భారత్లో దాదాపు 3కోట్ల 43లక్షలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ మరణాల సంఖ్య ఈ మధ్యే 50లక్షల మార్కును దాటిన విషయం తెలిసిందే.
ప్రతి 3 నెలలకు 5కోట్ల కేసులు..
వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో పలు దేశాల్లో వైరస్ ఉద్ధృతి కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. గడిచిన మూడు నెలలుగా రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య 36శాతం తగ్గింది. అయినప్పటికీ ప్రతి మూడు నెలల్లో 5కోట్ల మంది ఇన్ఫెక్షన్ బారినపడుతున్నారు. వైరస్ వెలుగు చూసిన మొదట్లో 5కోట్ల కేసులు నమోదు కావడానికి ఏడాది సమయం పట్టింది. ప్రస్తుతం ప్రతి మూడు నెలలకు 5కోట్ల కేసులు నమోదవుతున్నాయి. పలు దేశాల్లో మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది.
యూరప్లో మళ్లీ విజృంభణ..
రష్యా, ఉక్రెయిన్, గ్రీస్ వంటి దాదాపు 55 దేశాల్లో ఇన్ఫెక్షన్లు క్రమంగా పెరుగుతున్నాయి. యూరప్లో పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండడం వైరస్ విజృంభణకు ఒక కారణంగా తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో సగానికంటే ఎక్కువగా ఈ యూరప్ దేశాల్లోనే నమోదవుతున్నాయి. ప్రతి నాలుగు రోజులకు ఇక్కడ 10లక్షల కేసులు బయటపడుతున్నాయి. రష్యాలో ఇప్పటివరకు 88లక్షల పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గతకొన్ని రోజులుగా అక్కడ నిత్యం వెయ్యి కొవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి. నవంబర్ 8న ఒక్కరోజే అత్యధికంగా 1190 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7వరకు రష్యాలో హాలీడే ప్రకటించారు.
వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం, ఇప్పటికే ఎంతోమంది ఇన్ఫెక్షన్ బారినపడి కోలుకోవడంతో చాలా దేశాలు వైరస్ ఉద్ధృతి తీవ్ర స్థాయిని దాటిపోయినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ చల్లని వాతావరణం, ప్రజలు భారీ సంఖ్యలో సమూహాలుగా ఏర్పడుతుండడం వల్ల కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటినుంచి 2022 చివరి మధ్యకాలంలో వైరస్ ఉద్ధృతిని కట్టడి చేయడంతోపాటు తీవ్రత ఎక్కువ కలిగిన కేసులు, మరణాలను సాధ్యమైనంత వరకు తగ్గించగలమని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రముఖ ఎపిడమాలజిస్ట్ మారియా వాన్ ఖేర్కోవ్ పేర్కొన్నారు.
టీకా కోసం పేద దేశాల ఎదురుచూపు..
ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ పేద దేశాల్లో మాత్రం కనీసం ఒక్క డోసు కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ఆయా దేశాల్లో ఇప్పటికీ 5శాతం కంటే తక్కువ మందికే కొవిడ్ టీకా అందింది. ఇలాంటి సందర్భంలో అల్ప ఆదాయ దేశాలకు వ్యాక్సిన్ అందించేందుకు సంపన్న దేశాలు ముందుకు రావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పలుసార్లు విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన 20దేశాలు దాదాపు 23.4బిలియన్ డాలర్ల నిధులను సమకూర్చాలని పిలుపునిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
నోటా విజేతగా నిలిస్తే?
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?