Tide: అంతరిక్షంలోనూ అవాక్కయ్యేలా చేయనుంది!
‘అవాక్కయ్యారా? ఇది ఎక్కువ మురికిని తొలగించి.. గొప్ప తెల్లదనాన్ని ఇస్తుంది’ అంటూ ప్రోక్టర్ అండ్ గాంబుల్(పీ అండ్ జీ) సంస్థ ఉత్పత్తి చేసే డిటర్జెంట్ బ్రాండ్ టైడ్ ప్రకటనను మీరు టీవీలో చూసే ఉంటారు కదా..! ఇప్పుడు టైడ్ డిటర్జెంట్తో భూమిపై ప్రజల దుస్తులనే కాదు.. అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు ధరించే ప్రత్యేక దుస్తులకు ఉన్న మురికి వదిలిస్తామంటోంది పీఅండ్జీ సంస్థ.
ఇంటర్నెట్ డెస్: ‘అవాక్కయ్యారా? ఇది ఎక్కువ మురికిని తొలగించి.. గొప్ప తెల్లదనాన్ని ఇస్తుంది’ అంటూ ప్రోక్టర్ అండ్ గాంబుల్(పీ అండ్ జీ) సంస్థ ఉత్పత్తి చేసిన డిటర్జెంట్ బ్రాండ్ టైడ్ ప్రకటనను మీరు టీవీలో చూసే ఉంటారు కదా..! ఇప్పుడు టైడ్ డిటర్జెంట్తో భూమి మీదున్న ప్రజల దుస్తులకే కాదు.. అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు ధరించే ప్రత్యేక దుస్తులకు పట్టిన మురికిని కూడా వదిలిస్తామంటోంది పీ అండ్ జీ సంస్థ.
సాధారణంగా అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు వారు ధరించే దుస్తులను ఉతకరు. బాగా మురికిగా మారే వరకు వాటినే ధరిస్తారు. ఆ తర్వాత కొత్తవి వేసుకొని విడిచిన దుస్తులను ఒక కవర్లో వేస్తారు. దీంతో వ్యోమగాముల కోసం ఎక్కువ సంఖ్యలో దుస్తులు.. టన్నుల కొద్దీ వస్త్రం వృథా అవుతుంది. ఈ సమస్యకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) పరిష్కారాన్ని ఆన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో పీ అండ్ జీ సంస్థతో నాసా చేతులు కలిపింది. అంతరిక్షంలో వ్యోమగాముల మురికి దుస్తులను ఎలా శుభ్రపరచాలనే విషయంపై పరిశోధన చేయనుంది. ఈ క్రమంలో ఒక టైడ్ డిటర్జెంట్.. ఒక స్టెయిన్ రిమూవల్ను ఈ ఏడాది చివర్లో ప్రయోగాత్మకంగా అంతరిక్షానికి పంపించనున్నట్లు పీ అండ్ జీ వెల్లడించింది. అంతరిక్షంలో.. గురుత్వాకర్షణ లేని చోట డిటర్జెంట్లో ఉండే పదార్థాలు ఏ విధంగా పనిచేస్తాయో శాస్త్రవేత్తలు పరిశోధించనున్నారు. ఆ తర్వాత స్టెయిన్ రిమూవల్ పెన్నులను కూడా పంపిస్తుందట.
వ్యోమగాముల దుస్తుల కోసం నాసా గతంలోనూ ఎన్నో ప్రయోగాలు చేసింది. వ్యోమగాములకు చెమట పట్టకుండా.. బ్యాక్టీరియా సోకకుండా యాంటిబ్యాక్టీరియల్ దుస్తులను తయారు చేసింది. కానీ ఇది శాశ్వత పరిష్కారం చూపలేకపోయింది. మరోవైపు చంద్రుడు, అంగారకుడిపైకి మానవసహిత రాకెట్లను ప్రయోగించే యోచనలో ఉన్న నాసాకు ఇదో సమస్యగా మారింది. ఈ ప్రయోగాల్లో వ్యోమగాములు సుదీర్ఘకాలం రాకెట్లలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు ధరించేందుకు భారీ సంఖ్యలో దుస్తులను తీసుకెళ్లడం కష్టతరమైన పని. అందుకే పీ అండ్ జీతో కలిసి నాసా ‘టైడ్’ ప్రయోగానికి సిద్ధమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
సంక్షిప్త వార్తలు
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’