75 ఏళ్ల తరవాత మరో యుద్ధం చేస్తున్నాం:ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవకాశం దొరికితే చాలు అంతర్జాతీయ వేదికలపై చైనా చర్యలను ఎండగడుతుంటారు.
చైనాపై విరచుకుపడిన అమెరికా అధ్యక్షుడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవకాశం దొరికితే చాలు అంతర్జాతీయ వేదికలపై చైనా చర్యలను ఎండగడుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణకు ఆ దేశ చర్యలే కారణమంటూ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ చైనా వైరస్ వ్యాప్తికి ఐరాస ఆ దేశాన్ని జవాబుదారీ చేయాలంటూ డిమాండ్ చేశారు. అగ్రరాజ్యంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించడంతో 2లక్షల మంది అమెరికన్లు బలయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఆ సంఖ్య సుమారు 10లక్షలుగా ఉంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ఐరాస సర్వ ప్రతినిధి సభ 75వ వార్షిక సమావేశాల్లో వీడియో సందేశం ద్వారా చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 75 సంవత్సరాల తరవాత ప్రపంచం అతి పెద్ద సమస్యను ఎదుర్కోంటోంది. కనిపించని శత్రువైన ‘చైనా వైరస్’పై తీవ్ర పోరాటం చేస్తున్నాం. 188 దేశాల్లోని అనేక మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మన ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాను జవాబుదారీ చేయాలి. ఈ మహమ్మారి ప్రారంభ దశలో చైనా దేశీయంగా ప్రయాణాలపై ఆంక్షలు విధించిన్పటికీ, అంతర్జాతీయంగా ఎలాంటి ఆంక్షలు విధించకుండా వైరస్ వ్యాప్తికి కారణమైంది’ అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అలాగే ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరును తప్పుబట్టారు. ఆ సంస్థ చైనా ఆడించినట్లు ఆడుతోందని విమర్శించారు. ‘చైనా ప్రభుత్వం, అది చెప్పినట్లు ఆడే ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదట్లో మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకినట్లు ఆధారాలు లేవని ప్రకటించాయి. తరవాత లక్షణాలు లేని వ్యక్తుల నుంచి ఈ వైరస్ వ్యాపించదని మరో తప్పుడు ప్రకటన చేశాయి. ఐరాస వారి చర్యలను పరిగణనలోకి తీసుకొని చైనాను జవాబుదారీ చేయాలి’ అంటూ చైనాపై మండిపడ్డారు.
అంతేకాకుండా పర్యావరణానికి తీవ్ర స్థాయిలో హాని కలిగించే విధంగా చైనా తీరు ఉందని ఆ దేశ చర్యలను దుయ్యబట్టారు. ‘యూఎస్ కంటే చైనా నుంచి కార్బన్ ఉద్గారాల శాతం రెట్టింపుగా ఉంది. ఆ పెరుగుదల కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆ దేశం మిలియన్ల కొద్ది టన్నుల్లో ప్లాస్టిక్ను సముద్రాల్లోకి విచ్చలవిడిగా కుమ్మరించడంతో పగడపు దిబ్బలకు హాని కలుగుతోంది. ఇతర దేశాల సముద్రజల్లాల్లోకి చొచ్చుకొని వచ్చి పరిమితికి మించి చేపలు పడుతుండటం తీవ్ర పరిణామం’ అంటూ చైనా చర్యలను ఖండించారు.
కరోనా వైరస్ చైనాలోని వూహాన్ నుంచి ప్రపంచాన్ని కమ్మేసిందని నిపుణులు భావిస్తున్నారు. దీని కారణంగా ఆమెరికా తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కాగా, వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుందని, దాన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి, వైరస్కు అమెరికా చరమగీతం పాడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఏదో ఒక అంశంపై చైనాపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. చైనా కూడా ఆ విమర్శలను గట్టిగానే తిప్పికొడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
Manipur: మణిపుర్లో మరోసారి మిలిటెంట్లు రెచ్చిపోయారు. భద్రతా సిబ్బంది శిబిరంపై కాల్పులతో విరుచుకుపడ్డారు. -
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు