Poonch encounter: రెండు వారాలైనా ఎన్కౌంటర్ ముగియలేదెందుకు..?
దాదాపు రెండు వారాలుగా జరుగుతున్న పూంచ్ ఎన్కౌంటర్లో భద్రతా దళాలకు మరో ఎదురుదెబ్బతగిలింది. ఆదివారం ఉగ్రవాదులు దాడి చేసి ఇద్దరు పోలీసులు, ఒక సైనికుడితో సహా.. బందీగా ఉన్న మరో ఉగ్రవాదిని గాయపర్చారు. భటా-దురయిన్ వద్ద
* పూంచ్లో మరోసారి ఉగ్రవాదుల పంజా..!
ఇంటర్నెట్డెస్క్: దాదాపు రెండు వారాలుగా జరుగుతున్న పూంచ్ ఎన్కౌంటర్లో భద్రతా దళాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం ఉగ్రవాదులు దాడి చేసి ఇద్దరు పోలీసులు, ఒక సైనికుడితో సహా.. బందీగా ఉన్న మరో ఉగ్రవాదిని గాయపర్చారు. భాతా-దురియా వద్ద ఎన్కౌంటర్ జరుగుతోన్న ప్రదేశానికి పోలీసులు, సైనికులు కలిసి.. తమ వెంట లష్కరే సంస్థకు చెందిన జియా ముస్తఫా అనే పాకిస్థానీ ఉగ్రవాదిని తీసుకెళ్లారు. ఆ ఉగ్రవాదితో కలిసి అడవిలోని ఓ ఉగ్ర స్థావరం వద్దకు భద్రతా దళాలు చేరుకొన్నాయి. అదే సమయంలో ఆ స్థావరంలో నక్కిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఒక సైనికుడితోపాటు ఉగ్రవాది ముస్తఫా కూడా గాయపడ్డాడు. దీంతో భద్రతా దళాలు కూడా ఎదురుదాడి ప్రారంభించాయి.
కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతకు ఆగస్టులోనే సైన్యం భారీ ఎత్తున గాలింపు చేపట్టింది. గాలింపు బృందాలకు సురాన్కోటెలోని డేరాకి గల్లీ ప్రాంతంలో అక్టోబర్ 10-11 అర్ధరాత్రి సమయంలో ఉగ్రవాదులతో మొదటిసారిగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక జేసీవోతో సహా ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రదేశం పూంచ్-రాజౌరీ జిల్లాల మధ్యలో ఉంటుంది. దీంతో ఉగ్రవాదులు రాజౌరీ వైపు అడవుల్లోకి పారిపోయారు. అక్టోబర్ 14న మరోసారి ఉగ్రవాదులు దాడి చేయడంతో నలుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. దీంతో సైన్యం పారా ట్రూపర్లను, డ్రోన్లను కూడా రంగంలోకి దించింది.
కఠనమైన పర్వతాలు.. చిక్కటి అడవులు..!
ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రదేశం భౌగోళికంగా అత్యంత కఠినంగా ఉంది. ఇక్కడ ఏటవాలు పర్వతాలపై పరుచుకొన్న చిక్కటి అడవుల్లో ఉన్న లోయలు, గుహలు, శిఖరాలు ఉగ్రవాదులకు రక్షణ ఇస్తున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇక్కడ 8-10 మంది ముష్కరులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీనికి తోడు ఈ ఉగ్రవాదులు పాక్ ఎస్ఎస్జీ కమాండోల వద్ద శిక్షణ పొందినట్లు భావిస్తున్నారు. ఉగ్రవాదులు చిన్న,చిన్న గ్రూపులుగా విడిపోయి తరచూ స్థావరాలు మారుస్తూ దాడులకు దిగుతున్నారు.
ఎన్కౌంటర్ ప్రదేశంలోని మెందహార్ నార్ ఖాస్ ప్రాంతంలో పర్వత గుహలు విపరీతంగా ఉన్నాయి. వీటిల్లో ముష్కరులు దాక్కొంటున్నారు. దీంతో సైన్యం కూడా ఈ ఆపరేషన్ను అత్యంత జాగ్రత్తగా నిదానంగా చేపట్టాలని నిర్ణయించింది. పూంచ్-రాజౌరీ రేంజి డీఐజీ వివేక్ గుప్తా దీనిపై మాట్లాడుతూ ‘‘దళాలు ఒక వ్యూహం ప్రకారం ఆపరేషన్ చేపట్టాయి. ఇది ముగియడానికి కొంత సమయం పడుతుంది. కచ్చితంగా దళాలే విజయం సాధిస్తాయి’’ అని పేర్కొన్నారు. ఒక్కో ప్రదేశంలో పూర్తిగా కూంబింగ్, తనిఖీలు, ఏరివేతను ముగించి మరో ప్రదేశానికి దళాలు చేరుతున్నాయి.
రాజౌరీ-పూంచ్ ఉగ్రవాదుల అడ్డగా..
ఈ ఏడాది జూన్ నుంచి జమ్ము పరిధిలోని రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఊపందుకున్నాయి. వేర్వేరు ఎన్కౌంటర్లలో ఇక్కడ 9 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఇక్కడ భౌగోళిక స్వరూపం ఉగ్రవాదులకు రక్షణ ఇస్తోంది. దీంతో 1990ల నుంచే భారీగా విదేశీ ముష్కరులు ఇక్కడికి వస్తున్నారు. అడవుల్లో అక్కడక్కడా ఉండే ఉగ్రవాదులను గుర్తించడం చాలా కష్టం. ఉగ్రవాదులకు స్థానికుల్లో కొందరు సహకరిస్తుండటం కూడా ఆపరేషన్ను కష్టతరంగా మారుస్తోంది. ఇప్పటికే ఉగ్రవాదులకు సహకరిస్తున్నారన్న అనుమానంతో దాదాపు 8 మంది స్థానికులను దళాలు అదుపులోకి తీసుకొన్నాయి.
నియంత్రణ రేఖ సమీపంలో నివసించే ప్రజలు విదేశీ ఉగ్రవాదుల సమాచారాన్ని గతంలో చాలా సార్లు దళాలకు ఉప్పందించారు. గతంలో కూడా పూంచ్లోని హల్కాక గ్రామాన్ని కూడా స్థానికులు ఇచ్చిన సమాచారంతోనే దళాలు స్వాధీనం చేసుకోగలిగాయన్న విషయాన్ని కశ్మీర్ మాజీ డీజీపీ ఎస్పీ వైద్ గుర్తుచేశారు. ఈ సారి పరిస్థితి కొంత మారింది.
ఫలితంగా క్షేత్రస్థాయిలో దళాలకు ఇంటెలిజెన్స్ సమాచారం లభించడం కష్టమవుతోంది. అందుకే ఎన్కౌంటర్ మొదలై 14 రోజులు పూర్తవుతున్నా.. ఉగ్రవాదులు కచ్చితంగా ఎక్కడున్నారనే విషయంపై స్పష్టత రావడంలేదు. ఎన్కౌంటర్ దృష్ట్యా స్థానిక ప్రజలను ఇళ్లుదాటి బయటకు రావద్దని భద్రతా దళాలు కోరాయి. జమ్ము-రాజౌరీ జాతీయ రహదారి కూడా మూతపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
ద్రవిడనాట పట్టు బిగించాలనే సంకల్పంతో ఉన్న ప్రధాని మోదీ.. ఆ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విస్తృత పర్యటన చేశారు. -
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
Dubai Rains: దుబాయ్లో చిక్కుకున్న భారతీయుల కోసం అక్కడి మన దౌత్య కార్యాలయం హెల్ప్లైన్ నంబర్లు విడుదల చేసింది. -
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నట్టుగా ఇటీవల బాలీవుడ్ నటుడు ఆమిర్ఖాన్ వీడియో వైరల్ కాగా, తాజాగా రణ్వీర్సింగ్కు అదే పరిస్థితి ఎదురైంది. -
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
మహిళా రెజ్లర్లు తనపై చేస్తున్న లైంగిక ఆరోపణల కేసులో మరింత విచారణ జరపాలని కోరుతూ బ్రిజ్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలోనే న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. -
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ నౌకా సిబ్బందిలో కేరళ మహిళను విడుదల చేశారు. దీంతో ఆమె నేడు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. -
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
రామేశ్వరం కెఫే బ్లాస్ట్ కేసులో నిందితుల నుంచి కీలక వివరాలు బయటపడుతున్నాయి. వారు ఈ దాడి కుట్రకు వాడేసిన పాత ఫోన్లనే వినియోగించినట్లు తేలింది. -
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
అంతరిక్షం కూడా భవిష్యత్ యుద్ధాలకు వేదికగా మారిందని భారత త్రివిధ దళాల అధిపతి (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. -
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
Arvind Kejriwal: బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ పెంచుకునేందుకు స్వీట్లు, మామిడి పండ్లను తింటున్నారని కోర్టుకు తెలిపింది. -
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. -
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియాశ్రీనేత్
కాంగ్రెస్ (Congress) నేత సుప్రియా శ్రీనేత్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది. -
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రుణం కోసం.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్