క్యాపిటల్ భవనంలోనే బైడెన్ ప్రమాణ స్వీకారం!
క్యాపిటల్ భవనంలో భద్రతా బలగాలు ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశాయి.
వాషింగ్టన్: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు తాను హాజరు కాబోనని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా.. హాజరవుతానంటూ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ స్పష్టం చేశారు. మాజీ అధ్యక్షులు జార్జ్ బుష్, బిల్ క్లింటన్ వంటి ఎందరో ప్రముఖులు కూడా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరుకానున్నారు. అమెరికా క్యాపిటల్ భవనంలో చోటుచేసుకున్న దాడి సంఘటన.. భద్రతా దళాల సంసిద్ధతపై అనుమానాలను రేకెత్తిస్తోంది. కాగా, ఈ ఉదంతం తమకు హెచ్చరికగా పనిచేసిందని.. రానున్న ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని లోపరహితంగా నిర్వహిస్తామని అధికార వర్గాలు అంటున్నాయి. ఇందుకుగానూ తాము చేసిన ఏర్పాట్లను ఈ విధంగా వివరించాయి..
ప్రమాణ స్వీకారం ఎక్కడంటే..
కరోనా ఆంక్షల కారణంగా నాటి కార్యక్రమాలు కుదింపునకు గురయ్యాయి. వేడుకలు పరిమితమయ్యీయి. అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్, ఉపాధ్యక్ష పదవిని చేపట్టబోయే కమలా హారిస్లు అదే క్యాపిటల్ భవనంలోని వెస్ట్ ఫ్రంట్ ప్రాంతంలో అధికారాన్ని చేపట్టాల్సి ఉంది. కాగా, ట్రంప్ అభిమానులు పోలీసు రక్షణను ఛేదించి మరీ లోపలికి ప్రవేశించిన ప్రదేశం కూడా ఇదే కావటం గమనార్హం. నాటి ఘటనలో ప్రదర్శనకారులు ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం అప్పటికే ఏర్పాటు చేసిన మంచెలు, మెట్ల వరుసలను కూడా ధ్వంసం చేశారు.
రాజీలేని భద్రత
బుధవారం నాటి అనూహ్య సంఘటనతో క్యాపిటల్ భవనంలో భద్రతా బలగాలు ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశాయి. జాతీయ స్థాయి ప్రత్యేక ప్రాముఖ్యత గల (ఎన్ఎస్ఎస్ఈ) 59వ అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని.. జాతీయ నిఘా సంస్థ సీక్రెట్ సర్వీస్తో సహా డజన్ల కొద్దీ భద్రతా సంస్థలు కంటి మీద రెప్ప వేయకుండా పహారా కాస్తాయి. పది లక్షల మంది హాజరైనా వారిని అదుపులో ఉంచగల మిలిటరీ, పోలీసు బలగాలు ఈ సందర్భంగా విధుల్లో ఉంటారు. వర్జీనియా, పెన్సిల్వేనియా, న్యూయార్క్, న్యూజెర్సీ, మేరీలాండ్, డెలావేర్ రాష్ట్రాల నుంచి సుమారు 6200 మంది అదనపు భద్రతా సిబ్బంది.. క్యాపిటల్ పోలీసులకు సహాయంగా వాషింగ్టన్లో నెల రోజుల పాటు మకాం వేయనున్నారు. ఎక్కేందుకు సాధ్యం కాని విధంగా బ్లాక్ మెటల్తో చేసిన కంచెలను క్యాపిటల్ భవనం చుట్టూ హుటాహుటిన ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రహదారుల మూసివేత, దారిమళ్లింపు వ్యూహాలు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చాయి. ఓ సంవత్సర కాలంగా అమెరికా రహస్య సేవా విభాగం-యూఎస్ సీక్రెట్ సర్వీస్.. నేషనల్ స్పెషల్ సెక్యూరిటీ ఈవెంట్ (ఎన్నెస్సెస్సీ) తదితర ప్రభుత్వ భద్రతా సంస్థల సమన్వయంతో నిరంతరం కృషి చేస్తోంది.
దాడులు ప్రజాస్వామ్య పునాదుల్ని కదల్చలేవు..
అగ్రరాజ్య అధ్యక్షుడికి ఆహ్వానం పలికే ఈ కార్యక్రమానికి.. మామూలుగా ఐతే రెండు లక్షల మంది హాజరవుతారు. కాగా ఈసారి చట్టసభల సభ్యులు కాకుండా.. వారితో పాటు మరొకరికి మాత్రమే హాజరయ్యేందుకు అనుమతి లభించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు ఏమీ క్లోబుచర్, రాయ్ బ్లంట్ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. దీనిని నిరాటంకంగా నిర్వహించటం ఖాయమని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా ఈ తరహా దాడులు ప్రజాస్వామ్య పునాదుల్ని కదల్చలేవని.. అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిరూపిస్తామంటున్నారు. జనవరి 6 నాటి వైఫల్యం మరోసారి పునరావృతం కాకుండా.. ఆహూతులకు రాజీలేని భద్రత కల్పించటమే అగ్రరాజ్యం ప్రస్తుత కర్తవ్యమని వారు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి