US strike: అమెరికా నిఘా వైఫల్యం.. ఏమైందంటే?
అగ్రరాజ్యం అంచనాలు తప్పిందా? నిఘాలో వైఫల్యం చెందిందా? ఇటీవల అఫ్గాన్లో చివరిసారి జరిపిన డ్రోన్ దాడిలో ఉగ్రవాదులుగా పొరపాటు పడి సామాన్యుల ప్రాణాలు బలిగొందా? అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ వాదనలకు...
ఇంటర్నెట్ డెస్క్: అగ్రరాజ్యం అంచనాలు తప్పిందా? నిఘాలో వైఫల్యం చెందిందా? ఇటీవల అఫ్గాన్లో చివరిసారి జరిపిన డ్రోన్ దాడిలో ఉగ్రవాదులుగా పొరపాటు పడి సామాన్యుల ప్రాణాలు బలిగొందా? అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ వాదనలకు బలం చేకూర్చేలా న్యూయార్క్ టైమ్స్ తాజాగా ఓ పరిశోధనాత్మక కథనం వెలువరించింది. ఐసిస్ ఉగ్రవాదుల బదులు ఏ పాపం ఎరుగని ఓ సామాన్యుడిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగిందని అందులో పేర్కొంది. ఆగస్టు 26న కాబుల్ విమానాశ్రయం వెలుపల జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా సైనికులతోపాటు సుమారు 200 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తర్వాత 29న ఎయిర్పోర్ట్ సమీపంలో ఓ రాకెట్ దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా అదే రోజు కాబుల్లో డ్రోన్ దాడి చేపట్టి, ఒకరిని అంతమొందించినట్లు అమెరికా అధికారులు అప్పట్లో ప్రకటించారు. అఫ్గాన్ గడ్డపై అమెరికా జరిపిన చివరి దాడి అదే. కానీ.. ఇందులో ఓ అమాయకుడిని బలిగొన్నట్లు తాజా కథనంలో వెల్లడైంది.
అసలేం జరిగిందంటే..
కాబుల్ విమానాశ్రయానికి సమీపంలో నివసిస్తున్న జెమారీ అహ్మదీ(43).. కాలిఫోర్నియాకు చెందిన ఓ సంస్థలో ఎలక్ట్రికల్ ఇంజినీర్. ఆగస్టు 29న ఉదయం పై అధికారి తన ల్యాప్టాప్ తీసుకురమ్మని చెప్పడంతో.. సంస్థకు చెందిన తెల్లరంగు కారులో బయల్దేరారు. మధ్యలో వేర్వేరు చోట్ల ఇద్దరిని ఎక్కించుకున్నారు. మరోచోట పై అధికారికి చెందిన ల్యాప్టాప్ తీసుకున్నారు. తరువాత సదరు అధికారి ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు.. అప్పటికే ఎయిర్పోర్ట్ లక్ష్యంగా రాకెట్ దాడి జరిగింది. ఈ దాడికి కేంద్రంగా అమెరికన్ బలగాలు అనుమానించిన ప్రాంతం.. ఈ ఇంటికి సమీపంలోనే ఉంది. దాడి సైతం.. అహ్మదీ ప్రయాణిస్తున్న కారు మోడల్ లాంటిదే మరోదాని నుంచి జరిగింది. అప్పటికే సదరు వాహనం కోసం వెతుకుతున్న బలగాలకు.. ఆయన కారు కనిపించింది. దీంతో డ్రోన్ సాయంతో దాన్ని ట్రాక్ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో.. అహ్మదీ తన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నీళ్ల సీసాలు నింపుకొని, కారులో పెట్టి, తిరిగి ఇంటికి బయల్దేరారు. ఆయన పరిసరాల్లో నీటి సరఫరా నిలిచిపోవడంతో.. ఇక్కడినుంచే తీసుకెళ్తున్నారు. కానీ.. కారులో పేలుడు పదార్థాలు నింపినట్లు అమెరికా బలగాలు పొరబడ్డాయి. ‘ఆ సమయానికి అహ్మదీ గురించి మాకు ఇంకా పెద్దగా తెలియదు. కానీ.. కారుతో విమానాశ్రయంలోని దళాలకు ముప్పు పొంచి ఉందని భావించిన’ట్లు అమెరికా అధికారులు న్యూయార్క్ టైమ్స్కు చెప్పారు. సాయంత్రం 4.50కి అతను ఇంటికి చేరుకున్న సమయంలో కారుపై డ్రోన్తో దాడి చేశారు.
వారంతా నిర్దోషులు: మృతుడి సోదరుడు
సదరు కారుపై డ్రోన్ దాడి అనంతరం.. రెండో పేలుడు సంభవించినట్లు గత వారం అమెరికా ఆర్మీ జనరల్ మార్క్ మిల్లీ చెప్పారు. కానీ.. అక్కడ రెండో పేలుడు జరిగినట్లు ఆధారాలు లేనట్లు తేలింది. పరిసరాలూ ధ్వంసం కాలేదని వెల్లడైంది. ఈ ఘటనలో ముగ్గురు సామాన్యులు మృతి చెందినట్లు అమెరికా చెబుతున్నా.. ఏడుగురు చిన్నారులతోసహా 10 మంది పౌరులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ కథనంపై పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. ‘అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ దాడి క్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంది. కచ్చిత సమాచారంతోనే ఇది చేపట్టినట్లు మార్క్ మిల్లీ మాకు తెలిపారు. ఏదేమైనా.. ఎయిర్పోర్టు వద్ద మరిన్ని దాడులు జరగకుండా ఈ ఘటన అడ్డుకున్నట్లు మేం నమ్ముతున్నామ’న్నారు. కానీ.. ఈ ఘటనలో మృతులంతా నిర్దోషులని అహ్మదీ సోదరుడు రోమల్ అహ్మదీ వాపోయారు. ‘అతను(అహ్మదీ) ఉగ్రవాది అని మీరు అంటున్నారు. కానీ అతను అమెరికన్ల కోసం పనిచేశాడు. నా సోదరుడు, కుమార్తె, అల్లుళ్లను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిపార’ని కన్నీటి పర్యంతమయ్యారు. అప్పటికే అహ్మదీ.. అమెరికాలో పునరావాసం కోసం దరఖాస్తు చేసుకున్నాడని వెల్లడించారు. అహ్మదీతోపాటు ఆయన ఇద్దరు సోదరులు, వారి కుటుంబాలు కలిసే నివసిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.